Mahesh Babu : భైరవంకు షాక్ ఇచ్చిన ఖలేజా

రీ రిలీజ్ లు స్ట్రెయిట్ మూవీస్ కు భారీ నష్టాలు తెస్తున్నాయి అనే వాదన ఉంది. అన్నిసార్లూ కాదు కానీ కొన్నిసార్లు అది నిజమవుతుంది. అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రైడే. ఈ శుక్రవారం భైరవం చిత్రం విడుదలైంది. దీంతో పాటు ఖలేజా రీ రిలీజ్ అయింది. ఓపెనింగ్స్ పరంగా చూసుకున్నా.. క్రేజ్ పరంగా చూసుకున్నా.. ఖలేజా ముందు భైరవం పూర్తిగా తేలిపోయింది. ఖలేజాను ఇప్పటికే టివిల్లో, యూ ట్యూబ్స్ లో అనేక సార్లు చూసిన వాళ్లు కూడా థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు. అటు ఓవర్శీస్ లో సైతం ఖలేజాకు మంచి కలెక్షన్స వచ్చాయి. ఈ రెండు సినిమాల కలెక్షన్స్ మధ్య వ్యత్యాసం దాదాపు మూడు కోట్లకు పైనే ఉందంటే ఖలేజా వల్ల భైరవంకు ఎంత పెద్ద షాక్ తగిలిందో అర్థం చేసుకోవచ్చు. అలాగని భైరవం తీసిపడేసే సినిమా కాదు. ఫస్ట్ షో తర్వాత టాక్ బావుంది. మౌత్ బాగానే వినిపించింది. కానీ ఖలేజా సౌండ్ ముందు భైరవం మోత ఎవరికీ వినిపించలేదు అనేది వాస్తవం.
హైదరాబాద్ తో పాటు చాలా సిటీస్ లో భైరవం కంటే ఖలేజాకే ఎక్కువ థియేటర్స్ కేటాయించారు. అంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఆ చిత్రానికి వచ్చిన క్రేజ్ వల్లే అది సాధ్యం అయింది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీ ప్లెక్స్ లో బిగ్ స్క్రీన్ తో కలిపి ఆరు స్క్రీన్స్ ఉంటే.. అందులో శుక్రవారం ఐదు స్క్రీన్స్ ఖలేజాకే ఇచ్చారు. కేవలం ఒక్క స్క్రీన్ మాత్రమే భైరవంకు ఇచ్చారు. అది కూడా ఫుల్ కాకపోవడం విశేషమైతే.. అక్కడ ఖలేజా స్క్రీన్స్ అన్నీ ఫుల్ కావడం మహేష్ బాబు క్రేజ్ కు ఆయన ఫ్యాన్ బేస్ కు నిదర్శనంగా చెప్పొచ్చు.
ఏదేమైనా స్టార్ హీరోల రీ రిలీజ్ లు స్మాల్ హీరోల స్ట్రెయిట్ రిలీజ్ ను దెబ్బ కొడుతున్నాయి అనేది మరోసారి తేలిపోయింది. ఖలేజా లేకపోతే భైరవంకు మరింత బెటర్ కలెక్షన్స్ వచ్చి ఉండేవి అనేది కాదనలేని నిజం. మరి ఈ వీకెండ్ వరకూ ఖలేజా డామినేషన్ కొనసాగితే.. మంచి టాక్ తెచ్చుకున్నా భైరవం కు బాక్సాఫీస్ వద్ద నిరాశ తప్పదేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com