మలయాళ నటికి విమానంలో చేదు అనుభవం.. మద్యం మత్తులో ఉన్న తోటి ప్రయాణికుడు
ముంబై నుంచి కొచ్చి వెళ్తున్న విమానంలో తోటి ప్రయాణికుడు తనను వేధించాడని మలయాళ నటి దివ్యప్రభ కేరళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇన్స్టాగ్రామ్లో, ప్రయాణికుడు మత్తులో ఉన్నాడని, అతను తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. దివ్య తన పోస్టులో .. 12 సిలో కూర్చున్న ప్రయాణికుడు, మద్యం మత్తులో తన సీటును 12 బికి మార్చుకున్నాడు. ఎటువంటి లాజిక్ లేకుండా వాదనకు దిగాడు.
ఎయిర్ హోస్టెస్కు చెప్పినా టేకాఫ్కు ముందు అతడిని మరొక సీటుకు మార్చడం మాత్రమేనని 'అరియిప్పు' నటి పేర్కొంది. 'కొచ్చి విమానాశ్రయంలో దిగిన తర్వాత.. ఈ సమస్యను ఎయిర్లైన్ అధికారులకు నివేదించారు. వారు నన్ను విమానాశ్రయంలోని పోలీస్ ఎయిడ్ పోస్ట్కు మళ్లించారు' అని దివ్య రాశారు. ఆమె పోస్ట్లో టిక్కెట్తో పాటు తన అధికారిక పోలీసు ఫిర్యాదును జత చేసింది. ప్రయాణీకుల భద్రతపై అవగాహన పెంచడానికి ఆమెకు మద్దతు ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com