Manchu Lakshmi : గుర్రపు పందాలను బెట్టింగ్ గేమ్‌గా కాదు.. జాతీయ క్రీడగా చూడాలి : మంచు లక్ష్మీ

Manchu Lakshmi : గుర్రపు పందాలను బెట్టింగ్ గేమ్‌గా కాదు.. జాతీయ క్రీడగా చూడాలి : మంచు లక్ష్మీ
Manchu Lakshmi : గుర్రెపు పందెలు ఆడ‌టం, చూడ‌టం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంద‌ని సినీ న‌టి మంచు ల‌క్ష్మి అన్నారు.

Manchu Lakshmi : గుర్రపు పందెలు ఆడ‌టం, చూడ‌టం ఎంతో థ్రిల్లింగ్ గా ఉంటుంద‌ని సినీ న‌టి మంచు ల‌క్ష్మి అన్నారు. హైద‌రాబాద్ రేసింగ్ క్లబ్‌లో రేస్ టు విన్ సంస్థ నిర్వహిస్తున్న గుర్రం పందెల పోటీలను ఆమె తిలకించారు. రేసింగ్ కోర్స్ జాతీయ క్రీడ అని...దీన్ని బెట్టింగ్ గేమ్‌గా చూడకుడదన్నారు .హైదరాబాద్ రేసింగ్ క్లబ్‌కు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు ఈ గేమ్స్‌ ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.

గత వారం రోజులుగా వర్షాకాల గుర్రెపు పందెలు నిర్వహిస్తున్నామని...దేశంలోని పలు నగరాలకు చెందిన రైడర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వహకులు గోపి తెలిపారు . ఈ పోటీల్లో గెలుపొందిన విజేతకు పది లక్షల రూపాయల బహుమతి అందజేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story