Maniratnam : ప్రేక్షకులకు మణిరత్నం క్షమాపణలు

Maniratnam :  ప్రేక్షకులకు మణిరత్నం క్షమాపణలు
X

స్టార్డమ్ ను మోయడం ఎంత కష్టమో దాన్ని మోసే వారికే అర్థం అవుతుంది. ఇండియన్ సినిమాకు సంబంధించి లెజెండరీ డైరెక్టర్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే పేరు మణిరత్నం. ఆయన మేకింగ్, టేకింగ్, పిక్చరైజేషన్ ఎంతోమందికి లెసన్స్ లాంటివి. అలాంటి మణిరత్నం ప్రేక్షకులకు క్షమాపణ చెప్పుకున్నాడు. చెప్పుకున్నాడు అనేకంటే చెప్పాల్సిన పరిస్థితికే ఆయన వచ్చాడు అనుకోవచ్చు. యస్.. మణి, కమల్ హాసన్ కాంబోలో రీసెంట్ గా వచ్చిన థగ్ లైఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయం చూసింది. వరల్డ్ వైడ్ గా యూనానిమస్ డిజాస్టర్ గా డిక్లేర్ అయింది. అసలు వీరి కాంబోలో ఇంత చెత్త సినిమా ఏంటీ అని చాలామంది బాహాటంగానే విమర్శించారు. సో.. వీటికే తాజాగా మణిరత్నం రియాక్ట్ అయ్యాడు. సారీ చెప్పాడు.

‘ప్రేక్షకులు మా నుంచి మరో నాయకన్ లాంటి సినిమాను ఆశించారు. కానీ నేను వారందరికీ సారీ చెబుతున్నాను. ఎందుకంటే మళ్లీ వెనక్కి వెళ్లాలనే ఇంటెన్షన్ మాకెవ్వరికీ లేదు. అయినా ఎందుకు వెళ్లాలి..? మేము పూర్తిగా ఓ కొత్త ప్రయత్నం చేయాలనుకున్నాము. కానీ మా కలయికపై ఉన్న భారీ అంచనాల కారణంగా అందరికీ నచ్చలేదేమో. ప్రేక్షకులు ఇప్పుడు మేం చేసిన దానికి చాలా డిజప్పాయింట్ అయ్యారు..’అని చెప్పుకొచ్చాడు.

నిజానికి ఇలాంటివి అంత సీనియర్ డైరెక్టర్స్ కు కామన్ కాదు. బట్ మణిరత్నం లాంటి లెజెండ్ నుంచి ఈ చవకబారు సినిమాను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. అందుకే విమర్శకులు కాస్త ఘాటుగా స్పందించారు. అందుకే మణిరత్నం కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది.

అయితే ఈ సారీతో డిజాస్టర్ నుంచి మూవ్ ఆన్ అయిపోయాడు మణిరత్నం. ఆల్రెడీ తన కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడట.

Tags

Next Story