Hero Vishal: వినాయక చవితికి 'మార్క్ అంథోని' రిలీజ్

Hero Vishal: వినాయక చవితికి మార్క్ అంథోని రిలీజ్
నేనన్నింటిని మార్చి మరిచి మారి మరీ వచ్చాను

తమిళ హీరో విశాల్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే 'వాడు వీడు' లాంటి సెన్షేషన్ సినిమాతో అలరించిన ఆయన... ఇప్పుడు మార్క్ అంథోని అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో విశాల్ కు జోడీగా పెళ్లిచూపులు ఫేం రీతూ వర్మ నటిస్తోంది. వినాయక చవితి కానుకగా ఈ సినిమాను సెప్టెంబర్ 15న రిలీజ్ చేయడానికి చిత్ర యునిట్ రెడీ అయింది.




టీజర్ రిలీజ్ అయి ఇప్పటికే సంచలనాలను నమోదు చేసింది. 1975 ప్రాంతంలో జరిగే కథగా సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. అందులోనే ఫోన్ తో టైమ్ ట్రావెల్ అనే కథ,అప్పటి ఆహార్యం అలరించనుంది. నేనన్నింటిని మార్చి, మరిచి, మారి, మరీ వచ్చాను ఎస్ జే సూర్య డైలాగ్ ఆకట్టుకుంది. ఆపై విశాల్ చెప్పే నేను మార్క్ ను కాను అంథోని అని ఫైట్ సీలో చెప్పే డైలాగ్ ఆయన్ను డ్యుయల్ రోల్ లో నటించినట్లు తెలుస్తోంది.

ఈసినిమాను అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా... అఫిషియల్ రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యునిట్.


పోస్టర్ లో మెయిన్ లీడ్స్ అందరూ సరికొత్త రెట్రో లుక్ తో కనిపించారు. దీంతో సినిమాపై ఆసక్తి అమాంతం పెరిగింది. ఇటీవల రిలీజైన టీజర్ కు అద్భుతమైన స్పందన లభించింది. విశాల్ ఇందులో గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న లుక్, ఎస్.జె.సూర్య కామెడి టైమింగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

Tags

Read MoreRead Less
Next Story