దూసుకుపోతున్న 'నా రాజా నువ్వే'.. వంద మిలియన్ల వ్యూస్ తో సెన్సేషన్

దూసుకుపోతున్న నా రాజా నువ్వే.. వంద మిలియన్ల వ్యూస్ తో సెన్సేషన్
సోషల్ మీడియాలో సెన్సేషన్.. వంద మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసిన 'నా రాజా నువ్వే'

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ నటి సమంత రూత్ ప్రభు జంటగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ 'ఖుషి'. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ 'నా రాజా నువ్వే' సాంగ్.. ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ట్రెండింగ్ లో నిలుస్తున్న ఈ పాట.. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ తో తన సత్తా చాటుతోంది.

ఈ మధ్యే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'ఖుషీ'.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉండగా.. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన 'నా రాజా నువ్వే', 'ఆరాధ్య' పాటలకు ఎనలేని రెన్సన్స్ వచ్చింది. మరో రకంగా ఇవి మూవీకి సెన్సేషనల్ బజ్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఇక తాజాగా ఈ సినిమాలోని పాటలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. ఖుషీలోని నా రాజా నువ్వే సాంగ్ సోషల్ మీడియాలో రికార్డ్ సృష్టిస్తోంది. గత 11 వారాల క్రితం విడుదలైన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది. రిలీజ్ అయినప్పటి నుంచి ఈ పాట ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ రికార్డ్ సాధించడంతో 'ఖుషీ' హిట్ పక్కా అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలోని పాటలకు ఇప్పటికే మంచి క్రేజ్ రాగా.. జూలై 28న మరో సాంగ్ రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఈ పాట 'ఖుషీ' టైటిల్ సాంగ్ అని సమాచారం. ఇంతకు ముందు విడుదలైన పాటలకు మంచి స్పందన రాగా.. మరి ఇప్పుడు రిలీజ్ కాబోయే సాంగ్ ఎలా ఉండబోతుంది అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా సెప్టెంబర్ 1 న తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలతో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.


Tags

Read MoreRead Less
Next Story