Sathyam Sundaram : కార్తీకి నాగ్ ప్రశంసలు

కొన్ని సినిమాలు కళ్లు, మెదడును ఉత్తేజితం చేస్తాయి. చాలా తక్కువ చిత్రాలు మాత్రమే హృదయాల్ని స్పృశిస్తాయి. మనసులను తట్టిలేపుతాయి. ఎంత కంట్రోల్ చేసుకున్నా కన్నీళ్లు రాకుండా ఆపలేము. ఈ మధ్య కాలంలో అలాంటి సినిమా అంటే సత్యం సుందరం అనే చెబుతున్నారు అందరూ. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా అద్భుతమైన ప్రశంసలు వస్తున్నాయి. ఈ తరహా హృదయాలను కదిలించిన సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు అంటున్నారు. తెలుగులో కలెక్షన్స్ కాస్త వీక్ గా ఉన్నా.. దేవర మానియా తగ్గిన తర్వాత ఊపందుకునే అవకాశాలున్నాయి.
తాజాగా అక్కినేని నాగార్జున ఈ మూవీ చూసి తన స్పందనను తెలియజేశాడు. కార్తీని ఉద్దేశిస్తూ.. నిన్న రాత్రి సినిమా చూశాను. అద్భుతంగా నటించావు. అరవింద్ జీ కూడా చాలాచాలా బాగా చేశారు. చూస్తున్నంత సేపూ నవ్వుకుంటూనే ఉన్నాను. నాకు ఎన్నో చైల్డ్ హుడ్ మెమరీస్ గుర్తుకు వచ్చాయి. అలాగే మన ఊపిరి నాటి రోజులు కూడా గుర్తొచ్చాయి. నవ్వుకుంటూనే నిద్రపోయాను. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వస్తుండటం సంతోషంగా ఉంది.." అంటూ పోస్ట్ చేశాడు.
తమిళ్ లో ఈ మూవీకి కమర్షియల్ గానూ మంచి పేరు వచ్చింది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ప్యూర్ హార్టెడ్ మూవీగా వచ్చిన ఈ చిత్రాన్ని 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. గోవింద్ వసంత్ సంగీతం అందించాడు. తెలుగమ్మాయి శ్రీ దివ్య హీరోయిన్ గా నటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com