Nagarjuna : రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున

Nagarjuna :  రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున
X

అక్కినేని నాగార్జున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు. ఆయనతో పాటు భార్య అమల కూడా ఉంది. కొన్నాళ్ల క్రితం నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది. హైడ్రా పేరుతో సాగిన ఆ కూల్చివేతలపై రేవంత్ ఇచ్చిన ఆదేశాలే ప్రధానం. నాగార్జున లాంటి సెలబ్రిటీని కూడా వదలం అనే బలమైన సందేశం కూడా ఇందులో ఉంది. అప్పటి నుంచి నాగ్, ప్రభుత్వం మధ్య గ్యాప్ వస్తుంది అనుకున్నారు. బట్ నాగార్జున అదేం పట్టించుకోలేదు. ఆ మధ్య రాష్ట్ర విపత్తు నిధి కోసం తన వంతుగా భారీ విరాళం కూడా అందించాడు. రీసెంట్ గా వీరు ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో కూడా కలుసుకున్నారు. ఇక ఇప్పుడు నాగ్.. సిఎమ్ ను కలవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది.

జూన్ 6న నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని పెళ్లి ఉంది. ఆ పెళ్లికి ఆహ్వానించడానికే నాగ్ .. రేవంత్ రెడ్డిని కలిశాడు. అఖిల్ .. బిజినెస్ మేన్ కూతురైన జైనాబ్ ను ప్రేమించాడు. జైనాబ్ తండ్రికి నాగార్జునతో కూడా వ్యాపార సంబంధాలున్నాయి. అందుకే ఈ పెళ్లి ఈజీగా సెటిల్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితమే ఎంగేజ్మెంట్ అయింది. జూన్ 6న ఈ జంట ఒక్కటి కాబోతోందన్నమాట. అదీ మేటర్.

Tags

Next Story