Nagarjuna : నాగార్జున రగడ రీ రిలీజ్ అవుతోంది..

అక్కినేని నాగార్జున నటించిన సినిమా ‘రగడ’. వీరు పోట్ల దర్శకుడు. నాగ్ సరసన అనుష్క, ప్రియమణి హీరోయిన్లుగా నటించారు. 2010 డిసెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి అప్పట్లో మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ తర్వాత టివిల్లోనూ, యూ ట్యూబ్ లోనూ చూసిన చాలామంది. ఈ మూవీకి అలాంటి రివ్యూస్ ఎందుకు ఇచ్చారా అని ఆశ్చర్యపోయారు. మంచి ఎంటర్టైన్మెంట్ తో ఉంటుందీ చిత్రం. నాగార్జున చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే రాయలసీమ స్లాంగ్ తో అదరగొట్టాడు. అనుష్క, ప్రియమణి గ్లామర్ విషయంలో పోటీ పడ్డారు. ఛార్మీ ఐటెమ్ సాంగ్ అదనపు ఆకర్షణగా కనిపిస్తుంది. బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మాస్టర భరత్ కామెడీ అదిరిపోతుంది.
కొన్నాళ్ల క్రితం నాగార్జున అభిమానులు మాస్ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారు. మాస్ రిలీజ్ టైమ్ లోనూ రీ రిలీజ్ టైమ్ లోనూ హిట్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు రగడ వంతు వచ్చింది. ఈ చిత్రాన్ని కూడా 4 కే లో అప్డేట్ చేస్తున్నారు. రీ రిలీజ్ అంటే ఓ స్పెషల్ డే ఉండాలి కదా. అందుకే ఆగస్ట్ 29న ఫిక్స్ అయ్యారట. అంటే అది కింగ్ నాగ్ బర్త్ డే కదా. అంతకు మించిన స్పెషల్ డేట్ ఏముంటుంది మరి. సో.. రగడకు ఈ సారి థియేటర్స్ నుంచి ఎలాంటి అప్లాజ్ వస్తుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com