Nandamuri Tarakaratna: చికిత్సకు స్పందిస్తున్న తారకరత్న.. మరిన్ని పరీక్షలు అవసరం: బెంగళూరు వైద్యులు

Nandamuri Tarakaratna: చికిత్సకు స్పందిస్తున్న తారకరత్న.. మరిన్ని పరీక్షలు అవసరం: బెంగళూరు వైద్యులు
Nandamuri Tarakaratna: జనవరి 27న గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

Nandamuri Tarakaratna: జనవరి 27న గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ప్రస్తుతం బెంగళూరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎన్టీ రామారావు మనవడు, బాలకృష్ణ సోదరుని కుమారుడు నందమూరి తారకరత్న.

టీడీపీ నేత నారా లోకేష్‌కు మద్దతుగా యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న తరుణంలో ఆయన స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనకు అత్యవసర చికిత్స అవసరమైంది. దాంత అతడిని బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. తారకరత్న పలు తెలుగు సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమరావతిలో ఆయన చేసిన విలన్ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అందులో ఆయన చేసిన నటనకుగాను నంది అవార్డు అందుకున్నారు.

నందమూరి తారక రత్న ఫిబ్రవరి 22, 1983న ఆంధ్రప్రదేశ్‌లోని నిమ్మకూరులో జన్మించారు. నందమూరి మోహన కృష్ణ తండ్రి, నందమూరి శాంతి మోహన్ తల్లి. అయితే అతడిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని ఉన్నత స్థాయి డయాగ్నస్టిక్స్ వెల్లడించింది. అతని పరిస్థితి మున్ముందు మరిన్ని పరీక్షల అనంతరం అంచనా వేయబడుతుందని వెల్లడించారు. సంప్రదాయ మార్గదర్శకాలు మరియు ప్రోటోకాల్‌లను అనుసరించి చికిత్స జరుగుతోందని పేర్కొన్నారు.

తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. ఈ దంపతులకు కూతురు నిష్క ఉంది.

Tags

Read MoreRead Less
Next Story