Naresh: ముదిరిన వ్యవహారం.. ఇంటి గుట్టు బట్టబయలు..

Naresh: ముదిరిన వ్యవహారం.. ఇంటి గుట్టు బట్టబయలు..
Naresh: సెలబ్రిటీస్ ఏం చేసినా కెమెరా వారిపైనే ఫోకస్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ మధ్య ఏదో ఉంది.

Naresh: సెలబ్రిటీస్ ఏం చేసినా కెమెరా వారిపైనే ఫోకస్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ మధ్య ఏదో ఉంది.. రోజూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. మా మధ్య ఏం లేదు అని డైరెక్టగా అనకపోయినా ఇన్ డైరెక్ట్ గా మాత్రం హింట్ ఇస్తున్నారు.. ఆ విషయమే నరేష్ మూడో భార్యకి చిర్రెత్తుకొచ్చినట్లుంది.

మైసూర్ లోని ఓ హోటల్ లో నరేశ్, పవిత్రా లోకేశ్ కలిసి బస చేస్తున్నారని తెలుసుకున్న రమ్య అక్కడికి చేరుకుని వాగ్వాదానికి దిగారు. తనకు విడాకులివ్వకుండా మరో మహిళని ఎలా పెళ్లి చేసుకుంటారని గొడవ చేశారు. పవిత్రను చెప్పుతో కొట్టేందుకు యత్నించగా చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. దీంతో నరేశ్, పవిత్ర అక్కడినుంచి వెళ్లిపోయారు.

నరేశ్, రమ్యలు గత కొంత కాలం నుంచి విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నరేశ్.. పవిత్రకు దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల వీరిరువురు కలిసి మహాబలేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించుకున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. పెళ్లి చేసుకున్నారన్న కథనాలు కూడా వెలువడ్డాయి.

వీరి వ్యవహారం ఏ మాత్రం మింగుడుపడని రమ్య.. నాకు విడాకులు ఇవ్వకుండా వాళ్లిద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు.. ఇది చట్టరిత్యా నేరం అని ప్రెస్ మీట్ పెట్టి మరీ హెచ్చరించింది. అయితే ఇవన్నీఆరోపణలు మాత్రమే అని .. డబ్బు కోసం ఆమె తమని బ్లాక్ మెయిల్ చేస్తోందని వివరణ ఇచ్చుకున్నారు పవిత్ర, నరేష్. ఈ నేపథ్యంలోనే నరేష్ రమ్యకు విడాకుల నోటీస్ పంపిన విషయాన్ని వెల్లడించారు. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు, తాజా ఘటన తోడై వ్యవహారం మరింత ముదిరినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story