OTT లోకి 'మళ్లీ పెళ్లి'..!

OTT లోకి మళ్లీ పెళ్లి..!

నరేష్ పవిత్ర జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. 26మే 2023న రిలీజ్ ఇండస్ట్రీలో హాట్ టాక్ తెచ్చుకుంది. ఒక రకంగా ఇది నరేష్ పవిత్రల బయోపిక్ అని చెప్పవచ్చు. ఇద్దరి జీవితాల మధ్య జరిగిన సంఘటనల ఆదారంగా తీసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి ప్రేక్షకులను గిలిగింతలు పెట్టింది. తాజాగా ఓటీటీలో రిలీజ్ అవడానికి రెడీ అయింది మళ్లీ పెళ్లి. ఈ సినిమాకు ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించారు.

'మళ్లీ పెళ్లి' చిత్ర నిర్మాణం జరుగుతున్నప్పటి నుంచి రిలీజ్ అయ్యేవరకు సోషల్ మీడియాలో విశేష అభిమానాన్ని అందుకుంది. ఈ సినిమాను 3 కోట్లకు అమెజాన్ ప్రైమ్ హక్కులు సొంతం చేసుకోగా, ఆహా 1 కోటికి సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. జూన్ 23న రెండు ఓటీటీల్లో ఒకే సారి రిలీజ్ కానుంది.

కథ విషయానికి వస్తే.. ప్రముఖ నటుడైన నరేందర్ (నరేశ్), సౌమ్య సేతుపతి (వనిత విజయ్ కుమార్) ను పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిస్తారు. అప్పటికే నరేందర్ కు మరో ఇద్దరితో వివాహమై విడిపోయి ఉంటాడు. నరేందర్ తల్లికూడా సినిమా ఇండస్ట్రీలో మంచి పేరున్న కథానాయిక. ఆవిడ డైరెక్షన్ చేసే సినిమాలో సౌమ్య అసిస్టెంట్ గా ఉంటుంది. ఇద్దరి మాటలు కలసి ఆపై పెళ్లి వరకు దారితీస్తుంది. కాపురంలో గొడవలు మొదలవుతాయి.

జీవితంలో ప్రశాంతత కావాలనుకున్న నరేందర్ కు మరోనటి అయిన పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది. ఆపై ఇద్దరు ఎలా ఒకటవ్వాలని ప్రయత్నిస్తారు చివరికి ఏమైంది అన్నది సినిమాలో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story