Nikhil Siddharth: 'ఇలా జరుగుతుంటే బాధగా ఉంది'.. నిఖిల్ ఎమోషనల్ ట్వీట్..

Nikhil Siddharth (tv5news.in)

Nikhil Siddharth (tv5news.in)

Nikhil Siddharth: ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లే నిఖిల్.. చివరి సినిమా ‘అర్జున్ సురవరం’.

Nikhil Siddharth: టాలీవుడ్‌లో కమర్షియల్ కథలు మాత్రమే కాదు.. వైవిధ్యభరితమైన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ మధ్య హీరోలు కూడా కథకే ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో.. కొత్త కథలతో దర్శకులు ముందుకు వస్తున్నారు. అలాంటి దర్శకులను ఎప్పుడూ ప్రోత్సహించే హీరోలలో నిఖిల్ ఒకడు. ఈ కరోనా వల్ల నిఖిల్ ఎలాంటి కష్టాలను ఎదుర్కుంటున్నాడో ఓ ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చాడు.

కరోనా వల్ల ఎందరివో జీవితాలకు కామా పడింది. ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేసే వారికి ఏ రకంగానూ ఆదాయం లేకుండా పోయింది. సినిమాలంటే ఇష్టముండే వారికి ఎంటర్‌టైన్మెంట్ అందకుండా పోయింది. అటు సినిమావాళ్లకి, ఇటు ప్రేక్షకులకు సినిమాల నుండి దూరం పెరిగిపోయింది. ఇదే విషయాన్ని నిఖిల్ కూడా స్పష్టం చేశాడు.

ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లే నిఖిల్.. చివరి సినిమా 'అర్జున్ సురవరం'. ఈ సినిమా విడుదలయ్యి రెండు సంవత్సరాలు పైనే అయ్యింది. అయినా నిఖిల్ నుండి మరో చిత్రం రాలేదు. ప్రస్తుతం తాను నటిస్తున్న 18 పేజీస్, కార్తికేయ 2 చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే తన అప్‌కమింగ్ సినిమాల పరిస్థితిపై నిఖిల్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు.

'ఈ మహమ్మారి కెరీర్స్‌ను ఇంతగా ఎఫెక్ట్ చేయడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. అర్జున్ సురవరం సక్సెస్ తర్వాత నేను 4 సినిమాలు సైన్ చేశాను. ఆ 4 కథలపై నాకు చాలా నమ్మకం ఉంది. కానీ వాటి విడుదల తేదీలు మాత్రం తెలీకుండా పోయింది. అంతా మామూలుగా అవ్వాలని, మేము సినిమాలు పర్ఫెక్ట్‌గా విడుదల చేయాలని దేవుడిని కోరుకుంటున్నాను' అని ట్వీ్ట్ చేశాడు. ఇంకా చాలామంది ఇతర హీరోల పరిస్థితి కూడా ఇలాగే ఉందని అనుకుంటున్నారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story