Nitya Menen : నేను ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అలా చెప్పలేదు

Nitya Menen : నేను ఎవరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అలా చెప్పలేదు
తమిళ హీరో వేధింపులను తిప్పికొట్టిన నిత్యా మీనన్

గ్లామర్ షోకి పాత్రలకు దూరంగా ఉంటూ, తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. స్వప్న సినిమా భాగస్వామ్యంలో తను నటించిన కొత్త వెబ్ సిరీస్ 'శ్రీమతి కుమారి' సెప్టెంబర్ 29 నుంచి ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఈ కేరళ కుట్టి మీద ఇటీవల ఓ ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక తమిళ హీరో తనను విపరీతంగా వేధించాడని, దాని వల్ల తాను మానసికంగా చాలా క్షోభకు గురి కావాల్సి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా వచ్చిన వార్త బాగా వైరల్ అయ్యింది.

ఈ వార్తలపై తాజాగా నిత్యా మీనన్ స్పందించింది. తాను అలా ఎవరితోనూ అనలేదని, అయినా పేరు చెప్పకుండా ఎవరో వేధించారని చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని తనకూ తెలుసని చెప్పుకొచ్చింది. తాను ఎవరికీ ఎలాంటి ఇంటర్వ్యూ లేదని షాక్ ఇచ్చింది. ఈ రూమర్ ను ఎవరు క్రియేట్ చేశారో ఎవరికైనా తెలిస్తే చెప్పమని నిత్య కోరింది. ఇటీవలే నిత్యామీనన్ గురించి చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సినీ ఇండస్ట్రీ ఎనలిస్ట్ మనోబాలా విజయబాలన్ వెల్లడించారు. “నిత్యా మీనన్ గురించి చక్కర్లు కొడుతున్న వార్తలు నిరాధారమైనవి. వాటిల్లో ఎలాంటి నిజం లేదు” అని విజయ బాలన్ ట్వీట్ చేశారు. అలాగే, మరికొందరు ఎనలిస్టులు కూడా ఇలాంటి ట్వీట్స్ చేస్తున్నారు.

'కుమారి శ్రీమతి' ప్రమోషన్లలో భాగంగా దానికి హైప్ రావడం కోసం ఇలా చేశారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ సరసన జోడి కట్టిన నిత్య మీనన్ సహజంగా ఉండే తన బొద్దుతనానికి స్వస్తి చెప్పి ఇప్పుడు చక్కని రూపానికి వచ్చింది. అయినప్పటికీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి. ఇక స్వంత ఇంటి కోసం మద్యం షాపు పెట్టేందుకు వెనుకాడని యువతిగా 'శ్రీమతి కుమారి'లో నిత్య మీనన్ చాలా డిఫరెంట్ గా కనిపించనుందట.


Tags

Read MoreRead Less
Next Story