AS Ravi Kumar : ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూత

తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడుగా తనకంటూ ఓ ముద్ర వేసుకున్న ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారాయన. అయినా తన చివరి సినిమా 'తిరగబడర సామీ' ప్రమోషన్స్ లో హుషారుగానే కనిపించారు. కానీ ఇంతలోనే మరణించడం టాలీవుడ్ లో తీవ్ర విషాదాన్ని నింపింది. రవికుమార్ చౌదరి 2004లో గోపీచంద్ హీరోగా యజ్నం అనే సినిమాతో తర్శకుడుగా మారాడు. ఆ సినిమాతోనే గోపీచంద్ మళ్లీ హీరోగా నిలబడటం విశేషం. అంతకు ముందు అతను హీరోగా ఫెయిల్ అయ్యి విలన్ గా మారాడు. యజ్నంతో తిరిగి హీరో అయ్యాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో తర్వాత అలాగే దూసుకువెళుతున్నారు.
రెండో సినిమాకే ఏఎస్ రవికుమార్ కు బాలయ్య అవకాశం ఇచ్చాడు. వీరభద్ర పేరుతో రూపొందిన ఈ మూవీ ఫ్లాప్ అయింది. తరవాత వరుసగా ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో, పిల్లా నువ్వులేని జీవితం, సౌఖ్యం, తిరగబడర సామీ వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు. వీటిలో యజ్నం, పిల్లా నువ్వులేని జీవితం కమర్షియల్ గా పెద్ద విజయాలు సాధించాయి. రవికుమార్ టేకింగ్ బావుంటుంది. కానీ కథల వల్లే సక్సెస్ రేట్ తక్కువగా ఉంది అని చెప్పాలి.
తిరగబడర సామీ మూవీ ప్రమోషన్స్ లో హీరోయిన్ కు అందరి ముందు ముద్దు పెట్టడం.. అది కాస్తా వివాదం కావడం చూశాం. తర్వాత హీరోయిన్నే అతనిలో ఎలాంటి చెడు ఉద్దేశ్యం లేదు అని చెప్పి మేటర్ క్లోజ్ చేసింది. మొత్తంగా పరిశ్రమలో ఈ ఉదయం ఊహించని విషాదం చోటు చేసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com