'ఊరు పేరు భైరవకోన' నుంచి 'నిజమే నే చెబుతున్నా'

కెరీర్ మొదటినుంచి విభిన్న సినిమాలను ఎంచుకుంటున్నారు సందీప్

సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' నుంచి 'నిజమే నే చెబుతున్నా' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇందులో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ తదితరులు నటించారు. వి ఆనంద్ దర్శకత్వం వహించాగా.. నిర్మాత రాజేష్ దొంద నిర్మించారు. గతకొంత కాలంగా సందీప్ కిషన్ సినీ కెరీర్ అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. కెరీర్ మొదటినుంచి విభిన్న సినిమాలను ఎంచుకుంటున్నారు సందీప్. అయితే కమర్షియల్ హిట్లు మాత్రం సిధించలేకపోతున్నాడు. ప్రస్తుతం అతని ఆశలన్నీ ఊరు పేరు భైరవకోన మీదనే పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లు, పాటలు సినిమాకు హైప్ ను క్రియేట్ చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story