Ponniyin Selvan: ప్రీ రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఐశ్వర్యపై విక్రమ్ కామెంట్స్..

Ponniyin Selvan: ప్రీ రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఐశ్వర్యపై విక్రమ్ కామెంట్స్..
Ponniyin Selvan: బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, తమిళ నటుడు చియాన్ విక్రమ్ మణిరత్నం యొక్క మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ 1 కంటే ముందు ఒక ప్రాజెక్ట్ కోసం చాలా కాలం పాటు కలిసి పనిచేశారు.

Ponniyin Selvan: బాలీవుడ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, తమిళ నటుడు చియాన్ విక్రమ్ మణిరత్నం యొక్క మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ 1 కంటే ముందు ఒక ప్రాజెక్ట్ కోసం చాలా కాలం పాటు కలిసి పనిచేశారు.

ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్‌ ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఐశ్వర్య నందినిగా కనిపించనుంది. సోమవారం ఢిల్లీలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తమిళ నటుడు తన సహనటి ఐష్‌ను ప్రశంసించాడు. "ఆమె ఎప్పుడూ అందరి హృదయాలను దోచుకుంటుంది. పరిపూర్ణతకు ప్రతీకగా ఉంటుంది. నేను ఆమె సినిమాలు చూశాను,

రావణ్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌తో స్క్రీన్ పంచుకున్న చియాన్ విక్రమ్ మాట్లాడుతూ.. మీరు ఎక్కడికి వెళ్లినా ఆమె చిత్రంతో నగల దుకాణాలు, చీరల దుకాణాలు ఉంటాయి.

"నేను ఆమెతో కలిసి పని చేసాను, ఆమె ప్రొఫెషనల్‌గా తన పాత్రకు ఎంతో న్యాయం చేస్తారు. మరోపక్క భార్యగా, తల్లిగా ఇంట్లో సమయం గడపాలి. షూటింగ్‌కి వచ్చినప్పుడు డైలాగ్స్ సరిగ్గా చెప్పాలి.

హావ, భావాలు పలికించాలి. వంద శాతం న్యాయం చేస్తారు. ఆమెని చూసి చాలా నేర్చుకోవాలి. ఆమె వృత్తి నిబద్ధతకు హాట్సాఫ్ అని విక్రమ్.. ఐశ్వర్యను ప్రశంసలతో ముంచెత్తారు.

మణిరత్నం యొక్క పీరియాడికల్ డ్రామా పొన్నియిన్ సెల్వన్‌లో చియాన్ విక్రమ్ మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్‌లతో పాటు కార్తీ, త్రిష మరియు జయం రవి నటించారు. మాగ్నమ్ ఓపస్ సెప్టెంబర్ 30న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story