Prakash Raj : వారం రోజుల పాటు మౌనం..అందుకోసమే..!

Prakash Raj : వారం రోజుల పాటు మౌనం..అందుకోసమే..!
Prakash Raj : దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో బిజీ స్టార్‌లలో ఒకరు ప్రకాష్ రాజ్.. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే ఆయన.. ఇప్పుడు మౌనం వహించనున్నారు.

Prakash Raj : దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో బిజీ స్టార్‌లలో ఒకరు ప్రకాష్ రాజ్.. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే ఆయన.. ఇప్పుడు మౌనం వహించనున్నారు.. అది కూడా ఓ వారం రోజుల పాటు.. అయితే ఇదేదో నిరసనతో కాదు.. ఇటీవల కొంత అనారోగ్యానికి గురైన ఆయన... ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ వోకల్‌ కార్డ్స్‌కు వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇవ్వమని వైద్యులు సూచించారట. దీంతో వారం రోజుల పాటు మౌన వ్రతం అంటూ తన ట్విట్టర్ లో వెల్లడించారు ప్రకాష్ రాజ్.. కాగా తాజాగా సూర్య హీరోగా వచ్చిన జైభీమ్ చిత్రంలో పొలీస్ అధికారి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు ప్రకాష్ రాజ్.. 90వ దశకంలో తమిళనాడులో అణగారిన ప్రజల కోసం పోరాడిన న్యాయవాది-హైకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రు వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.


Tags

Read MoreRead Less
Next Story