Priyanka Chopra: సిద్ధివినాయకుని ఆలయంలో కుమార్తె మాల్తీ మేరీతో ప్రియాంక..
By - Prasanna |7 April 2023 7:47 AM GMT
Priyanka Chopra: ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్తో కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు.
Priyanka Chopra: ప్రియాంక చోప్రా తన కుమార్తె మాల్తీ మేరీ చోప్రా జోనాస్తో కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ముంబైలో తన రాబోయే వెబ్ సిరీస్ 'సిటాడెల్' ప్రచారంలో బిజీగా ఉన్న గ్లోబల్ ఐకాన్, సిద్ధివినాయకుని ఆలయంలో పూజ చేస్తూ కనిపించింది. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ప్రియాంక తన కూతురు మాల్తీ మేరీ ఎత్తుకుని దేవుని దర్శనానికి వచ్చింది. కొన్ని పూజ్యమైన చిత్రాలను అభిమానులతో పంచుకుంది. భారతదేశంలో అడుగు పెట్టిన తరువాత తన మొదటి పర్యటన సిద్ధివినాయకుడి ఆశీర్వాదంతో జరిగింది అని తెలిపింది. కుమార్తె మాల్తీ, ఆమె భర్త నిక్ జోనాస్తో కలిసి ముంబైకి చేరుకున్న ప్రియాంక, అంబానీలు హోస్ట్ చేసిన NMACC ఈవెంట్కు హాజరయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com