Pushpaka Vimanam : లేచిపోయిన భార్య ప్లేస్లో మరో అమ్మాయి.. ఇంతకీ ఎవరీ మీనాక్షి?
![Pushpaka Vimanam : లేచిపోయిన భార్య ప్లేస్లో మరో అమ్మాయి.. ఇంతకీ ఎవరీ మీనాక్షి? Pushpaka Vimanam : లేచిపోయిన భార్య ప్లేస్లో మరో అమ్మాయి.. ఇంతకీ ఎవరీ మీనాక్షి?](https://www.tv5news.in/h-upload/2021/11/11/592864-meenakshi.webp)
Pushpaka Vimanam : దొరసాని, మిడిల్క్లాస్ మెలొడీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'పుష్ఫక విమానం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా రేపు(శుక్రవారం) విడుదల కానుంది. పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే తన భార్య లేచిపోతే ఆ కుర్రాడు బయటకు చెప్పుకోలేక ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనే కాన్సెప్ట్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ ఆద్యంతం కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమా రేపు విడుదలఅవుతుండడంతో ప్రమోషన్లో భాగంగా ఓ ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో లేచిపోయిన భార్య స్థానంలో మరో అమ్మాయిని తన భార్యగా అందరికీ పరిచయం చేస్తున్నట్లుగా చూపించారు. ఇందులో ఆ అమ్మాయి మీనాక్షి అనే పాత్రలో నటిస్తోంది. ప్రోమోలో ఆ అమ్మాయి క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంది.
ఆ అమ్మాయి పేరు గీత్ సైనీ.. ఈమెకి ఇదే మొదటి సినిమా.. మహారాష్ట్రలో జన్మించింది గీత్ సైనీ.. కానీ ఓ పదేళ్ళ క్రితమే ఆమె ఫ్యామిలీ హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయారు. హైదరాబాదులోనే డీగ్రీ కంప్లీట్ చేసింది. చదువుకుంటున్నప్పుడే సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కె విశ్వనాథ్, జంధ్యాల సినిమాలంటే వీపరితమైన ఇష్టం.
నటి భానుప్రియ అంటే ఆమెకి చాలా ఇష్టం... స్వర్ణకమలం చిత్రం తనకి ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ.. ఇక పుష్పక విమానంసినిమాలో ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది గీత్ సైనీ.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com