Rajinikanth: రజినీకాంత్ కుటుంబానికే ఎందుకిలా..? ఇద్దరు కూతుళ్లకు అదే పరిస్థితి..

Rajinikanth: రజినీకాంత్ కుటుంబానికే ఎందుకిలా..? ఇద్దరు కూతుళ్లకు అదే పరిస్థితి..
Rajinikanth: రజినీకాంత్ కూతుళ్లు.. సినీ పరిశ్రమలో డైరెక్టర్లుగా తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Rajinikanth: విడాకులు అనేవి బయట సమాజంలో చాలా కామన్‌గా జరుగుతున్నవే. మనస్పర్థలతో, కోపాలతో ఎంతోమంది వివాహ బంధాన్ని తెంచేసుకుని విడాకులే బెటర్ అనుకుంటున్నారు. కానీ గ్లామర్ ప్రపంచంలో బ్రతికే వారిపై ఇతరుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. అందుకే తాజాగా విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్యల గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా రజినీకాంత్ మరో కూతురు సౌందర్య కూడా అప్పట్లో విడాకులు తీసుకున్న విషయం సెన్సేషన్‌గా మారింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మారినప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన స్టైల్‌కు, గ్రేస్‌కు కోలీవుడ్ మంచి వెల్‌కమ్‌నే ఇచ్చింది. ఇలా ఇంతకాలం రజినీ ప్రొఫెషనల్ లైఫ్ చాలా సాఫీగా సాగిపోయింది. ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహ బంధంలో కూడా ఇంతకాలం సంతోషంగానే ఉన్నారు. కానీ రజినీ కూతుళ్లు మాత్రం వారి వివాహ బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు.


రజినీకాంత్ ఇద్దరు కూతుళ్లు.. సౌందర్య, ఐశ్వర్య సినీ పరిశ్రమలో డైరెక్టర్లుగా తమ టాలెంట్‌ను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరు ప్రొఫెషన్స్ విషయంలో హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ముందుకెళ్తున్నారు. కానీ వీరిద్దరి వైవాహిక జీవితాలు అంత సాఫీగా మాత్రం సాగలేదు. ముందుగా రజినీ చిన్న కూతురు సౌందర్య అశ్విన్ రాజ్‌కుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. కానీ వీరికి కొడుకు పుట్టిన ఒక సంవత్సరం తర్వాత విడాకులు తీసుకున్నారు. సౌందర్య, అశ్విన్ విడాకులు తీసుకున్న రెండేళ్ల తర్వాత విషగన్ వనంగముడి అనే నటుడిని పెళ్లి చేసుకుంది.



ఇప్పుడు రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ఏకంగా పెళ్లైన 18 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించింది. ఈ విషయం విన్న ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. పలు కారణాలతో వీరి విడాకులు తీసుకోబోతున్నట్టు ధనుష్, ఐశ్వర్య వీరి సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story