Ram Charan: 'ఎవరికి భయపడతారు.. నాన్నకా? ఉపాసనాకా?'.. చరణ్ స్మార్ట్ ఆన్సర్..

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా నటించిన 'ఆచార్య' సినిమా చాలా వాయిదాల తర్వాత ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇద్దరు మెగా హీరోల మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచానలు భారీగానే ఉన్నాయి. ఇక ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా సందడిగా జరిగింది. ఈ ఈవెంట్లో సుమ అడిగిన ఓ ప్రశ్నకు రామ్ చరణ్ చాలా స్మార్ట్గా సమాధానం ఇచ్చాడు.
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినిమా విశేషాల గురించి, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడం గురించి మూవీ టీమ్ మాట్లాడింది. ఇక ఈవెంట్కు ఛీఫ్ గెస్ట్గా హాజరయిన రాజమౌళి కూడా ఈ ఇద్దరు హీరోల గురించి గొప్పగా మాట్లాడారు. ఆ సమయంలోనే సుమ సరదాగా రామ్ చరణ్ను కొన్ని ప్రశ్నలు అడిగి ఆటపట్టించింది. అందులో భాగంగా 'ఎవరికి భయపడతారు.. నాన్నకా? ఉపాసనాకా?' అని అడిగింది.
సుమ అడిగిన ప్రశ్నకు కాసేపు ఆలోచించిన చరణ్.. 'మా నాన్న.. అమ్మ దగ్గర జాగ్రత్తగా ఉంటారు. నేను కూడా అదే నేర్చుకుని ఉపాసన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉంటా.' అని సమాధానం ఇచ్చారు. అలా చేస్తే సుఖపడతావు అంటూ దీనికి కౌంటర్ ఇచ్చారు చిరంజీవి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com