Ramya Krishna: క్రేజీ కాంబినేషన్.. రజినీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ
Ramya Krishna: 'కోలమావు కోకిల', 'డాక్టర్' చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్తో సూపర్స్టార్ రజనీకాంత్ రాబోయే చిత్రం. యువ దర్శకుడు ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ను రూపొందిస్తుండగా, తాజా సంచలనం ఏమిటంటే, ప్రముఖ నటి రమ్యకృష్ణ ఈ చిత్రంలో విలన్ రోల్ ని పోషించడానికి సంతకం చేసింది. ప్రస్తుతానికి ' తలైవర్ 169 ' అని పిలుస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్లో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్, ప్రియాంక మోహన్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ ప్రతినాయకురాలిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. 1999లో విడుదలైన 'పడయ్యప్ప'లో రమ్యకృష్ణ నీలాంబరిగా నటించి మెప్పించింది. తన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందింది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది రమ్యకృష్ణకు.
నెల్సన్ దిలీప్కుమార్ 'బీస్ట్' నిర్మాతలుగా ఉన్న సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'తలైవర్ 169' కి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. రజనీకాంత్ సరసన జతకట్టేందుకు టీమ్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ను సంప్రదించిందని, ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించవచ్చని వార్తలు వచ్చినప్పటికీ చిత్ర టీమ్ వీరి పేర్లను ఇంకా ఖరారు చేయలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com