Rashmika Mandanna : విజయ్ దేవరకొండ వాయిస్ తో రష్మిక మందన్న టీజర్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లేటెస్ట్ మూవీ 'ద గర్ల్ ఫ్రెండ్'. రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఈ మూవీపై ముందు నుంచీ అంచనాలున్నాయి. రాహుల్ డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే అదీ కూడా రష్మిక మెయిన్ లీడ్ చేస్తుందన్నప్పుడు ఖచ్చితంగా ఓ సెన్సిబుల్ మూవీని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.. ఆడియన్స్. అది నిజమే అనేలా ఉందీ టీజర్. విశేషం ఏంటంటే ఈ టీజర్ కు విజయ్ దేవరకొండ ఇచ్చిన వాయిస్ ఓవర్ లో ఉన్న ఓ కవిత.. అది అతని పర్సనల్ ఒపీనియన్ ను కూడా ఎక్స్ ప్రెస్ చేస్తున్నట్టుగా ఉంది. టీజర్ అంటే సినిమా థీమ్ ను ఇన్ డైరెక్ట్ గా ఎక్స్ పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ వీళ్లు రష్మిక క్యారెక్టరైజేషన్ లోని డిఫరెంట్ షేడ్స్ ను చూపిస్తూ కట్ చేశారీ టీజర్. అదీ ఇంట్రెస్టింగ్ గానే ఉండటం రాహుల్ సక్సెస్.
"నయనం నయనం కలిసే తరుణం.. ఎదలో పరుగే పెరిగే వేగం.. నా కదిలే మనసును అడిగా సాయం.. ఇకమీదట నువ్వే దానికి గమ్యం.. విసిరిన నవ్వులో వెలుగును చూశా.. నవ్వాపితే పగలే చీకటి తెలుసా.. నీకని మనసును రాసిచ్చేశా.. పడ్డానేమో ప్రేమలో బహుశా.. " ఇదీ వాయిస్ ఓవర్ లో వినిపించిన కవిత. ఈ అందమైన కవితకు తగ్గట్టుగానే రష్మిక మందన్నాతో పాటు మేల్ లీడ్ లో కనిపించబోతోన్న దీక్షిత్ శెట్టి పాత్రా పరిచయం అవుతుంది. అతను ఆమె కోసం సాగించే పయనం.. ఆ పయనంలో ఎదురైన అనుభవాలు.. తద్వారా కలిగిన ఎమోషన్స్ అన్నట్టుగా ఉందీ టీజర్. చివర్లో.. ' ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా అస్సలు పడను' అంటూ రష్మిక చెప్పిన సింగిల్ డైలాగ్.. ఆమె పాత్ర ఎంత బలంగా ఉండబోతోందో చెబుతోంది.
ఇక టీజర్ చూస్తుంటేనే సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం బిగ్గెస్ట్ ఎసెట్ కాబోతోందనిపిస్తోంది. ఖుషీ, హాయ్ నాన్న, మనమే చిత్రాలతో తెలుగు వారిని ఆకట్టుకున్న హేషమ్ ఈ సారి ఇంకా గొప్ప సంగీతం ఇవ్వబోతున్నాడేమో అనిపిస్తోంది. టీజర్ లోనే చాలా బావుంది నేపథ్య సంగీతం.
రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి, రావు రమేష్, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నాడు. అల్లు అరవింద్ ప్రెజెంటర్. రిలీజ్ డేట్ లాంటివేం చెప్పలేదు కానీ.. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతుండటం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com