CCA Awards: ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన నగరంలోనే అవార్డు: రిషబ్ శెట్టి

CCA Awards: ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన నగరంలోనే అవార్డు: రిషబ్ శెట్టి
CCA Awards: బాలీవుడ్ నటులను కాదని దక్షిణాది తారలు రిషబ్ శెట్టి, సాయిపల్లవిలకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు ఇచ్చి తమ గౌరవాన్ని చాటుకుంది సంస్థ.

CCA Awards: బాలీవుడ్ నటులను కాదని దక్షిణాది తారలు రిషబ్ శెట్టి, సాయిపల్లవిలకు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు ఇచ్చి తమ గౌరవాన్ని చాటుకుంది సంస్థ. రిషబ్ కాంతార సినిమాకు గాను ఉత్తమ నటుడిగా, గార్గి సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచిన సాయి పల్లవి ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. ముంబైలో జరిగిన అవార్డుల కార్యక్రమంలో రిషబ్ మాట్లాడుతూ.. “నన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. 15 ఏళ్ల క్రితం తొలిసారి ముంబైకి వచ్చాను. అంధేరీ వెస్ట్‌లోని ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేశాను. 15 ఏళ్ల తర్వాత ఇదే ముంబైలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాను. ఈ క్షణం చాలా సంతోషంగా ఉంది'' అని అన్నారు.

ఉత్తమ నటిగా సాయి పల్లవి..!

సాయి పల్లవి ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. 'గార్గి' చిత్రానికి గానూ ఆమె ఈ అవార్డును అందుకుంది. “ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. సినిమా కోసం అందరూ చాలా కష్టపడతారు. ప్రేక్షకుల ప్రేమను ఆస్వాదిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు చేయడానికి ఈ అవార్డులు దోహదపడతాయి’’ అని సాయి పల్లవి అన్నారు.

కాంతారా అప్‌డేట్..!

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కాంతార.. మామూలు సినిమాగా విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని రిషబ్ మరోసారి స్పష్టం చేశారు. సీసీఏ అవార్డు అందుకున్న అనంతరం ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ.. ''ఇప్పటికే 'కాంతారా-2' చూశారు. త్వరలో ‘కాంతారా-1’ చూస్తారు” అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story