Chiranjeevi : తండ్రి కొడుకులుగా మామా అల్లుళ్లు..!

Chiranjeevi : కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీని కంప్లీట్ చేసిన చిరంజీవి ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇందులో మూడు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా లైన్లో పెట్టాడు చిరు.. అయితే ఇది రీమేక్.. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన బ్రోడాడీ మూవీని తెలుగులో రీమేక్ చేసేందుకు చిరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తెలుగులో ఈ మూవీని డైరెక్ట్ చేసే బాధ్యతను డైరెక్టర్ హరీష్కి చిరు అప్పజేప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
స్క్రిప్ట్లో చేయాల్సిన మార్పులు గురించి ఇప్పటికే హరీష్తో డిస్కస్ చేశారట చిరు.. మోహన్లాల్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ తండ్రి కొడుకులుగా నటించిన బ్రో డాడీ మూవీ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. తండ్రీ, కొడుకులిద్దరూ ఒకేసారి తండ్రి అవడంతో వారిద్దరికీ అనుకోని సమస్యలు ఎదురవుతాయి...వాటిని వారు ఎలా అధిగమించారన్నది కథాంశం. అయితే ఈ సినిమాలో చిరుకి కొడుకు పాత్రలో ముందుగా వరుణ్ తేజ్ పేరు బలంగా వినిపించింది.
కానీ ఇప్పుడు ఆ రోల్కి సాయి ధరమ్ తేజ్ని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పోలికల పరంగా చూస్తే వరుణ్ తేజ్ కంటే సాయిధరమ్ తేజ్లో చిరంజీవి పోలికలు ఎక్కువగా ఉంటాయి. దీనితో సాయిని ఈ సినిమా కోసం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. అటు పవన్ కళ్యాణ్ చేస్తోన్న ఓ రీమేక్ లో కూడా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com