saipallavi : శాస్త్రి చివరి పాట.. సాయిపల్లవి ఎమోషనల్ ట్వీట్‌...!

saipallavi : శాస్త్రి చివరి పాట.. సాయిపల్లవి ఎమోషనల్ ట్వీట్‌...!
saipallavi : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవలే అనారోగ్య సమస్యలతో బాధపడతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే..

saipallavi : ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇటీవలే అనారోగ్య సమస్యలతో బాధపడతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.. 'సిరివెన్నెల' చిత్రంతో మెదలైన ఆయన సినీ ప్రయాణం.. 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో మగిసింది. శ్యామ్ సింగరాయ్ చిత్రంలో సీతారామశాస్త్రి రెండు పాటలు రాశారు. ఇందులో ఆయన రాసిన చివరి పాటను చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. ఈ పాట కూడా 'సిరివెన్నెల' అంటూ సాగుతుంది.

అయితే ఈ పాట పైన హీరోయిన్ సాయిపల్లవి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయింది. 'మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్‌' అంటూ సాయి పల్లవి ఎమోషనల్‌ అయ్యింది. కాగా ఈ పాటకి మెలోడీకి మిక్కీ జె. మేయర్‌ స్వరాలు అందించగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story