Samantha: కేటీఆర్ పోస్ట్ను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన సమంత.. ఇంతకీ ఏంటది..?
Samantha (tv5news.in)
Samantha: నాగచైతన్యతో సమంత విడాకుల తర్వాత.. తాను ఏ పోస్ట్ పెట్టిన వెంటనే వైరల్ అయిపోతోంది. అంతే కాకుండా తనకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగారు, సినిమాల్లో అవకాశాలు కూడా పెరిగాయి. మునుపటి కంటే ఎక్కువ సమంత ఇప్పుడే బిజీగా మారింది. మునుపటి కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది కూడా. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో కేటీఆర్ పెట్టిన ఒక పోస్ట్ను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియలో ఇదే హాట్ టాపిక్.
చిన్నపిల్లలకు మరింత రక్షణ చేకూర్చేందుకు న్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకునేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ ఇటీవల బాల రక్షక్ వాహనాలను ప్రారంభించారు. జిల్లాకొకటి చొప్పున 33 బాల రక్షక్ వాహనాలను ఏర్పాటు చేశారు. 1098కి డయల్ చేస్తే వెంటనే ఆదుకునేలా సదుపాయం కల్పించారు.
మంత్రి సత్యవతి చేసిన ఈ పనిని మెచ్చకుంటూ కేటీఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేటీఆర్ పెట్టిన పోస్ట్ను సమంత తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేసింది. 33 బాల రక్షక వాహనాలు ప్రారంభమయ్యాయి అంటూ చప్పట్లు కొట్టిన ఎమోజీ పెట్టింది. సినిమాలతో బిజీ అయినా కూడా సమంత ఎప్పుడూ సామాజిక కార్యక్రమాలలో కూడా చురుగ్గా ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com