చికిత్స కోసం సూపర్ స్టార్ నుంచి రూ. 25 కోట్లు.. ఇన్ స్టాలో వివరణ ఇచ్చిన సమంత

చికిత్స కోసం సూపర్ స్టార్ నుంచి రూ. 25 కోట్లు.. ఇన్ స్టాలో వివరణ ఇచ్చిన సమంత
సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం ఒక సూపర్ స్టార్ నుంచి రూ. 25 కోట్లు తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించింది

సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం ఒక సూపర్ స్టార్ నుంచి రూ. 25 కోట్లు తీసుకున్నట్లు వచ్చిన వార్తలపై స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వార్తలను ఖండించింది. వ్యాధుల గురించి వ్యాఖ్యానించేటప్పుడు బాధ్యత వహించాలని ఆమె ప్రజలను కోరారు. సమంతా 2022లో మయోసిటిస్ అనే ఇమ్యూనిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించింది. అప్పటి నుండి ఆమె చికిత్సపై దృష్టి పెడుతోంది. అందుకే సినిమాల నుంచి కూడా విరామం తీసుకుంది.

అయితే, సమంత ఒక తెలుగు సూపర్ స్టార్ నుండి ఆర్థిక సహాయం తీసుకున్నట్లు వచ్చిన వార్తలతో కలత చెందింది. ఈ వార్తను ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసింది, “మయోసిటిస్ చికిత్సకు 25 కోట్లా? ఎవరు మీకు ఇలాంటి సమాచారం అందించారు. అందులో అతి చిన్న భాగాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. నా కెరీర్‌లో నేను ఎంతో కొంత సంపాదించుకున్నాను. కాబట్టి, నన్ను నేను చూసుకోగలను. ధన్యవాదాలు."

ఆరోగ్య పరిస్థితి గురించి వార్తలను రాసే ముందు బాధ్యతతో వ్యవహరించాలని సమంత ప్రజలను కోరారు. “మయోసిటిస్ అనేది వేలమంది బాధపడుతున్న పరిస్థితి. అటువంటప్పుడు తప్పుడు సమాచారం అందించి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని అమె అన్నారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో తొలిసారిగా సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. కాశ్మీర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రానుంది.





Tags

Read MoreRead Less
Next Story