Samantha: ఫ్యాన్స్ ఖుషీ.. సమంత పోస్ట్ వైరల్..
Samantha: అగ్ర నటి సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె తన వర్క్కి సంబంధించిన విషయాలను, మనసులోని భావాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో తరచుగా పోస్టులను పెడుతుంది. నటి తన అభిమానులతో సంభాషిస్తుంది. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ఆమెకు చాలా ఇష్టం.
అకస్మాత్తుగా, సమంత గత మూడు నెలల నుండి సోషల్ మీడియాకు దూరంగా ఉంది. దీంతో అభిమానులను ఆందోళనకు గురయ్యారు. ఆమె అస్వస్థతకు గురైందని అందుకే విరామం తీసుకుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ గత రాత్రి సమంత ఒక పోస్ట్ పెట్టింది. వెనక్కి తగ్గాను.. కానీ ఓడిపోలేదు అని అర్ధం వచ్చేలా పోస్ట్ పెట్టింది.
ఆమె స్కిన్ ఎలర్జీకి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం USA వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక క్లిక్ను పోస్ట్ చేసింది. "డౌన్ నాట్ అవుట్" అనే క్యాప్షన్తో సమంత తన పెట్ డాగ్కి సంబంధించిన క్లిక్ను పోస్ట్ చేసింది. వెంటనే నందిని రెడ్డి, వరుణ్ ధావన్ వంటి ప్రముఖులు సమంత పోస్ట్కి రిప్లై ఇచ్చారు.
సమంత తిరిగి తన ప్రాజెక్టులలో నిమగ్నమయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఆమె త్వరలో ఖుషి సెట్స్లో జాయిన్ అవుతుంది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో సమంత నటిస్తోంది. త్వరలో విడుదల కానున్న 'యశోద' డబ్బింగ్ పనులను కూడా సమంత పూర్తి చేయనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com