బాలయ్య, చిరంజీవికి ఒకే సీన్... రెండూ ఇండస్ట్రీ హిట్సే.. దర్శకుడు కూడా ఒక్కరే..!

బాలయ్య, చిరంజీవికి ఒకే సీన్... రెండూ ఇండస్ట్రీ హిట్సే.. దర్శకుడు కూడా ఒక్కరే..!
Balakrishna- Chiranjeevi : బాలకృష్ణ, చిరంజీవి.. ఇద్దరు మాస్ హీరోలే.. ఇద్దరి సినిమాలు ఒకేసారి పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

Balakrishna- Chiranjeevi : బాలకృష్ణ, చిరంజీవి.. ఇద్దరు మాస్ హీరోలే.. ఇద్దరి సినిమాలు ఒకేసారి పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. వీరిద్దరి సినిమాలు మధ్య పోటీ అంటే అది తార స్థాయిలో ఉంటుంది. అయితే ఇద్దరి కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో బాలయ్యకి సమరసింహారెడ్డి కాగా, చిరంజీవికి ఇంద్ర సినిమా. ఈ రెండు సినిమాలకి దర్శకుడు ఒక్కరే కావడం విశేషం.. ఆయనే బి.గోపాల్.

బాలయ్య, గోపాల్ అంటేనే పక్కా మాస్.. అలాంటి వీరికి మాస్ లాంటి కథ దొరికితే ఇంకెలా ఉంటుంది.. సరిగ్గా వారికి సమరసింహారెడ్డి లాంటి కథ 1999లో దొరికింది. ఈ సినిమాలో బాలయ్య నటనకి అంతా ఫిదా అయిపోయారు. అయితే ఈ సినిమాలో ముందుగా కైకాల సత్యనారాయణ పాత్ర లేదు. ఆయన కోసం ఓ పాత్రని క్రియేట్ చేయమని పరుచూరి బ్రదర్స్ కి సూచించారు దర్శకుడు బి గోపాల్.. అలా సమరసింహారెడ్డిలో పొలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు పరుచూరి బ్రదర్స్.

ఈ సినిమాలో సమరసింహారెడ్డిని చూసి కైకాల సత్యనారాయణ దండం పెట్టే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సీన్ సినిమాకి మొత్తానికి మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఇక చిరంజీవి, గోపాల్ కాంబోలో వచ్చిన ఇంద్ర సినిమాకి కూడా పరుచూరి సోదరులే రైటర్స్.. ఈ సినిమాలో గవర్నర్ గా నటించిన ప్రకాష్ రాజ్ ఇంద్రసేనారెడ్డిని చూసి దండం పెడతాడు. ఈ సీన్ ఆ సినిమాకి మెయిన్ హైలెట్ గా నిలిచింది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కావడం.

Tags

Read MoreRead Less
Next Story