Sharukh Khan : సుకుమార్ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్

బాలీవుడ్ హీరోలకు వాళ్ల దర్శకులతో ఇక వర్కవుట్ కాదని అర్థమైంది. ఒక్కో టాప్ హీరో మెల్లగా సౌత్ డైరెక్టర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఆల్రెడీ షారుఖ్ ఖాన్ తమిళ్ డైరెక్టర్ తో అట్లీతో చేసిన జవాన్ తో వెయ్యి కోట్లు కొల్లగొట్టాడు. ఆమిర్ ఖాన్ కూడా లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయబోతున్నాడు. రీసెంట్ గా సన్నీ డియోల్ తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేసిన జాట్ తో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా తెలుగు దర్శకుడి వైపు వస్తున్నాడు. అది కూడా తెలుగు ప్రొడక్షన్ హౌస్ కావడం విశేషం.
కొన్నాళ్లుగా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించబోతున్నారు. దర్శకుడు సుకుమార్ పూర్తిగా మైత్రీ బ్యానర్ కు అంకితం అయిపోయాడా అన్నట్టుగా ఉంది పరిస్థితి. మైత్రీ మూవీ మేకర్స్ జాట్ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఇప్పుడు మరో టాప్ స్టార్ అయిన షారుఖ్ తో తమ ఆస్థాన దర్శకుడితో సినిమా చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోందంటున్నారు.
పుష్ప, పుష్ప 2 చిత్రాలతో దర్శకుడు సుకుమార్ కు బాలీవుడ్ లోనూ తిరుగులేని క్రేజ్ వచ్చింది. నార్త్ లో అతనికీ ఫ్యాన్స్ స్టార్ట్ అయ్యారు. అలాంటి సుక్కూతో షారుఖ్ మూవీ అంటే ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని వేరే చెప్పక్కర్లేదు. అయితే సుకుమార్ నెక్ట్స్ మూవీ రామ్ చరణ్ తో అనేది ఆల్రెడీ వచ్చిన వార్త. మరి షారుఖ్ తో మూవీ రామ్ చరణ్ తర్వాత ఉంటుందా లేక ముందే ఉంటుందా అనే క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com