శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషే దొంగ అని తెలిసినా..

శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషే దొంగ అని తెలిసినా..
నటి శోభన ఇంట్లో నగదు చోరీకి గురైంది. తన ఇంట్లో ఉంచిన రూ.40వేలు చోరీకి గురయ్యాయని తెలుసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది.

నటి శోభన ఇంట్లో నగదు చోరీకి గురైంది. తన ఇంట్లో ఉంచిన రూ.40వేలు చోరీకి గురయ్యాయని తెలుసుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు శోభన ఇంట్లో పని చేసే పనిమనిషే డబ్బు దొంగిలించిందని తెలుసుకున్నారు.. విషయం బయటకు రావడంతో పనిమనిషికి నేరం ఒప్పుకోక తప్పింది కాదు.. తనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని అందుకే డబ్బు దొంగిలించవలసి వచ్చిందని శోభనకు విన్నవించుకుంది. క్షమించమని వేడుకుంది. దీంతో శోభన కేసును వెనక్కు తీసుకుంది. పనిమనిషిని క్షమించి వదిలేసింది. ఆమెని తిరిగి పనిలో నియమించుకుంది.

శోభన, ఆమె తల్లి తేనాంపేట శ్రీమాన్ శ్రీనివాస రోడ్డులోని ఇండిపెండెంట్ హౌస్‌లో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు. తన ఇంట్లో నగదు చోరీకి గురైందని నటి గురువారం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా, పోలీసు బృందం ఆమె ఇంటికి వెళ్లి, ఇంటి సహాయకుడు డ్రైవర్‌తో కలిసి డబ్బును దొంగిలిస్తున్నట్లు గుర్తించింది. అయితే, పనిమనిషి నేరాన్ని అంగీకరించడంతో ఫిర్యాదును ఉపసంహరించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story