'కేరళ స్టోరీ' టీమ్ అదా శర్మతో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. ట్రైలర్ రిలీజ్

కేరళ స్టోరీ టీమ్ అదా శర్మతో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
విపుల్ అమృత్‌లాల్ షా, సుదీప్తో సేన్ మరియు అదా శర్మల 'బస్తర్: ది నక్సల్ స్టోరీ ' ప్రకటించినప్పటి నుండి జనాల్లో భారీ ఉత్సుకత కనిపించింది.

విపుల్ అమృత్‌లాల్ షా, సుదీప్తో సేన్ మరియు అదా శర్మల 'బస్తర్: ది నక్సల్ స్టోరీ ' ప్రకటించినప్పటి నుండి జనాల్లో భారీ ఉత్సుకత కనిపించింది. రెండు టీజర్‌లకు అనూహ్య స్పందన రావడంతో పాటు పోస్టర్లు ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రేక్షకుల అంచనాలను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లి, మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'బస్తర్: ది నక్సల్ స్టోరీ' ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ట్రైలర్ లో ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయి. 'ది కేరళ స్టోరీ' విజయంతో టీమ్ మరొక బోల్డ్ మరియు ఇంపాక్ట్ ఫుల్ సబ్జెక్ట్‌తో తిరిగి వచ్చింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది.

ట్రైలర్‌లో నక్సలైట్లు సిఆర్‌పిఎఫ్ జవాన్లను హతమార్చిన దృశ్యాలు ఉన్నాయి. జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు మానవ నరికివేత సీక్వెన్స్ నుండి పిల్లలను కాల్చడం, రాజకీయ ప్రముఖులను కాల్చి చంపడం, అమాయకులను చంపడం వరకు, ఈ ట్రైలర్ ఒక బలమైన పంచ్ ప్యాక్ చేస్తుంది.

ట్రైలర్ ఉత్కంఠను మరో స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా రియల్‌గా జరిగిన సంఘటనలు కళ్లకు కట్టినట్లు చూపింది. ప్రతిభావంతురాలైన నటి అదా శర్మ పోషించిన IPS నీర్జా మాధవన్ పాత్ర ట్రైలర్ లో హైలైట్. పాత్రకు అదా తెచ్చిన పరిపూర్ణత, చిత్తశుద్ధి ఆమె నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఆమెను నటిగా మరో మెట్టు పైన నిలుపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

విపుల్ అమృత్‌లాల్ షా యొక్క సన్‌షైన్ పిక్చర్స్ ద్వారా నిర్మించబడింది. ఆషిన్ ఎ. షా సహ నిర్మాతగా సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన 'బస్తర్: ది నక్సల్ స్టోరీ'కి అదా శర్మ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం మార్చి 15, 2024న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

https://youtu.be/5KfJWVcnbdI

Tags

Next Story