Tiger 3 : ఫస్ట్ రోజే బాక్సాఫీస్ ను షేక్ చేసిన సల్మాన్ మూవీ

Tiger 3 : ఫస్ట్ రోజే బాక్సాఫీస్ ను షేక్ చేసిన సల్మాన్ మూవీ
బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ.44.5 కోట్లు వసూలు చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'టైగర్ 3'

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజా చిత్రం 'టైగర్ 3' బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు రూ.44.5 కోట్లు వసూలు చేసింది. రూ.42.30 కోట్ల వసూళ్లతో 2019లో విడుదలైన భరత్ చిత్రం తర్వాత ఖాన్‌కు ఈ చిత్రం అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ కూడా నటించారు. ఇమ్రాన్ హష్మీ ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు.

పలు నివేదికల ప్రకారం, ఈ చిత్రం ముంబైలో అత్యధిక ప్రదర్శనలను చూసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్‌సీఆర్, పూణే, బెంగళూరులో ప్రదర్శనలు జరిగాయి. టైగర్ 3 ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది. అడ్వాన్స్ బుకింగ్‌ల కారణంగా మొదటి రోజు వేల టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. దీపావళి సెలవుదినం, ఆదివారం విడుదల కావడం వల్ల సినిమా మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి.

PVR INOX లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ బిజిలీ ఈ మూవీపై స్పందిస్తూ.. “దేశవ్యాప్తంగా సల్మాన్ ఖాన్‌కు ఉన్న భారీ అభిమానుల ఫాలోయింగ్, తమిళం, తెలుగులో డబ్బింగ్ వెర్షన్‌లతో ఈ చిత్రం హిందీ బెల్ట్ దాటి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది” అని చెప్పారు. షారుఖ్ ఖాన్ 'పఠాన్', హృతిక్ రోషన్ 'కబీర్' (WAR) చిత్రంలో సల్మాన్ అతిధి పాత్రలో నటించి అభిమానులను ఉత్సాహపర్చాడు. ఇక మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' తర్వాత టైగర్ ఫ్రాంచైజీలో మూడవ భాగం.

ఇదిలా ఉండగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రంలో సల్మాన్ టైగర్‌గా, R&AW ఏజెంట్‌గా, కత్రినా జోయాగా నటించారు. టైగర్ తన కుటుంబాన్ని, దేశాన్ని శత్రువు (ఇమ్రాన్ హష్మీ) నుండి రక్షించడానికి ప్రయత్నిస్తాడు. తన కుటుంబాన్ని కోల్పోయినందుకు వ్యక్తిగతంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇమ్రాన్ ప్రయత్నిస్తాడు.


Tags

Read MoreRead Less
Next Story