ఇప్పటి వరకు వేరుగా.. ఇప్పుడు కలిసి: ఉపాసన

ఇప్పటి వరకు వేరుగా.. ఇప్పుడు కలిసి: ఉపాసన
పెళ్లైన తరువాత ఇద్దరే ఉంటే బావుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. కాపురాన్ని ఎంజాయ్ చేయొచ్చు.

పెళ్లైన తరువాత ఇద్దరే ఉంటే బావుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. కాపురాన్ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ పిల్లలు పుట్టిన తరువాత పెద్ద వాళ్ల తోడు ఉంటే మంచి చెడు అన్నీ చెబుతారు. పెద్ద వాళ్ల సంరక్షణలో చిన్నారులు ఆరోగ్యంగా పెరుగుతారు. అందుకే ఉపాసన ఆ నిర్ణయం తీసుకుంది. ఆమె ఏం చెసినా ఎంతో బాగా ఆలోచించి చేస్తుంది. మరికొంతమందికి ఆదర్శవంతంగా నిలుస్తుంది. తాజాగా చేసిన ఆమె ట్వీట్ ఉపాసనను మరొక మెట్టు పైన నిలిపేలా చేసింది.

చరణ్, నేను త్వరలో అత్తమామల దగ్గరకు షిప్ట్ అవుతున్నాం. పుట్టబోయే బిడ్డ సంరక్షణను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె తెలిపారు. తమ 11వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.సాధారణంగా ఎవరైనా దంపతులు పిల్లలు పుట్టిన తరువాత వేరు కాపురం పెడుతుంటారు. కానీ మేము దానికి పూర్తి భిన్నం.

ప్రస్తుతం చరణ్, నేను ఉంటున్నాం. బేబీ పుట్టిన తరువాత అత్తమామలతో ఉండాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే మా ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారు. వాళ్ల నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నాం. వారితో ఉంటే వచ్చే ఆనందాన్ని మా బిడ్డ కూడా పొందాలనుకుంటున్నాం అని ఉపాసన చెప్పారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు చరణ్ చాలా సంతోషించాడు. కుటుంబసభ్యులు కూడా చాలా ఆనందించారు. చరణ్ తన స్ఠైల్లో తన ఆనందాన్ని సెలబ్రేట్ చేశారు అని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story