Tollywood : 'నేనెక్కడున్నా' మూవీ పోస్టర్ రిలీజ్

ప్రముఖ బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. మాధవ్ కోదాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రానికి 'నేనెక్కడున్నా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఎయిర్ టెల్ గర్ల్ సాషా చెత్రీ కథానాయికగా పరిచయం అవుతోంది. జర్నలిజం, రాజకీయాలు అనే రెండు మార్గాల్లో ఈ సినిమా నడుస్తుందని తెలిపారు చిత్రబృందం. ఈ సినిమా పోస్టర్, టైటిల్, టీజర్ ను ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఆవిష్కరించారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఫస్ట్ కాపీ సిద్దమై సెన్సార్ కార్యక్రమాలకు రెడీ అవుతోంది. రష్యన్ డ్యాన్సర్లతో కోరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ రూపొందించిన పబ్ సాంగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. కె.బి.ఆర్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. అజగవ ఆర్ట్స్ పతాకంపై మారుతీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com