టాలీవుడ్ లో మరో విషాదం.. సీనియర్ నటుడు బాలయ్య మృతి..

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94) నేడు తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద యూసఫ్ గూడలోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. చిరంజీవి నటించిన ఊరికిచ్చిన మాట చిత్రంతో ఉత్తమ రచయితగా బాలయ్య నంది అవార్డు అందుకున్నారు.
ఎత్తుకు పై ఎత్తు చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసిన బాలయ్య 300 పై చిలుకు చిత్రాల్లో నటించారు. 1930లో గుంటూరు జిల్లా అమరావతి సమీపంలోని వైకుంఠపురంలో జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరు సాహిత్యాభిలాషులు కావడంతో కొడుకును బాగా చదివించాలనుకున్నారు.. అందుకే బాలయ్య ఆరోజుల్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేశారు. మిత్రుల ప్రోత్సాహంతో సినీ రంగ ప్రవేశం చేశారు.
కేవలం నటుడిగానే కాదు.. నిర్మాతగా, కథా రచయితగా, దర్శకుడిగా ఇలా ఇండస్ట్రీకి చెందిన పలు రంగాల్లో గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా.. మరణం కూడా ఈ రోజే సంభవించడం అంతా యాదృశ్చికం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com