Tollywood: ఓ అమ్మాయిని ప్రేమించా.. : సాయి ధరమ్ తేజ్

Tollywood: ఓ అమ్మాయిని ప్రేమించా.. : సాయి ధరమ్ తేజ్
Tollywood: ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లు కొట్టినా, ఆ టాపిక్ అంతా ఓ ఎత్తైతే పెళ్లి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు పెళ్లికాని నటీ నటులను.

Tollywood: ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని హిట్లు కొట్టినా, ఆ టాపిక్ అంతా ఓ ఎత్తైతే పెళ్లి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు పెళ్లికాని నటీ నటులను. ఇదే ప్రశ్న మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్‌కు కూడా ఎదురైంది. సాయి ధరమ్, సంయుక్తామీనన్ జంటగా నటించిన చిత్రం విరూపాక్ష ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లతో బిజీగా ఉన్న సాయి పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన లవ్‌స్టోరీ గురించి చెప్పుకొచ్చారు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని, కొన్ని కారణాలవల్ల బ్రేకప్ అయిందని తెలిపాడు. బ్రేకప్ తర్వాత చాలా సైలెంట్ అయిపోయానని, ఇప్పుడు అమ్మాయిలంటేనే భయం వేస్తుందని అన్నారు. తనకు నచ్చినప్పుడు పెళ్లిచేసుకుంటానని చెప్పాడు.

ఇక విరూపాక్ష విషయానికి వస్తే.. సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వం వహించారు. బాపినీడు సమర్పణలో బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించారు.

Tags

Read MoreRead Less
Next Story