Tollywood : టాలీవుడ్లో వారసుల టైం స్టార్ట్

టాలీవుడ్లో వారసుల టైం స్టార్టయింది. హీరో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ, శ్రీకాంత్ కొడుకు రోషన్, ప్రిన్స్ మహేశ్ బాబు వారసుడు గౌతమ్ కృష్ణ తమ నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరిలో మోక్షజ్ఞ ఇంకా తెరంగేట్రం చేయలేదు. కానీ తనకంటూ ఓ బజ్ క్రియేట్ చేసుకున్నడు రోషన్, గౌతమ్లు తమ నటనను ఇప్పటికే నిరూపించుకున్నారు. అదే కోవలో యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్, జీవితల కూతురు శివానీ రాజశేఖర్ కూడా ఆ జాబితాలో చేరింది. '2 స్టేట్స్' మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన శివానీ కోట బొమ్మాళీ పీఎస్ సినిమాతో సక్సెస్ అందుకుని గ్లామర్ కంటే నటనేకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఈ ముద్దుగమ్మ. కోలీవుడ్లో నూ శివానీ నటిస్తోంది. రీసెంట్గా చిరుత కలర్ లో ఉన్న లాంగ్ ఫ్రాక్ హైహీల్స్ వేసుకొని తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. శివానీ సౌందర్యం స్వర్గంలో ఏంజిల్ లా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. 'ఒక మనసు' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మెగా ఫ్యామిలీ వారసురాలు నిహారిక. అలా వచ్చిన హీరో నాగబాబు కూతరు నిహారిక కొణిదెలకు ఆ సినిమా నిరాశే మిగిల్చింది. ఆ తరువాత కొన్ని మూవీస్ లో నటించినా అంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు వెబ్ సిరీస్లను నిర్మిస్తూ తన సత్తా చాటుతోంది. నిహారిక కొణిదెల ఇటీవల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' మూవీ ఈ నెల 9న రిలీజ్ కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం మెగా కుటుంబానికి అద్భుతంగా ఉందని నిహారిక చెప్పింది. తనకు అండగా మెగా కుటుంబమంతా ఉందన్న ఈ బ్యూటీకి 'కమిటీ కుర్రోళ్లు' ఎంత సక్సెస్ అవుతుందో చూడాలి. నెపోటిజంపై విమర్శలు వస్తున్నా ఈ నట వారసులను భవిష్యత్తులో ఫ్యాన్స్ ఎలా ఆదరిస్తారోనని చర్చ జరుగుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com