Acharya : 'ఆచార్య' సినిమా గురించి ఈ పది విషయాలు మీకు తెలుసా?

Acharya : ఆచార్య సినిమా గురించి ఈ పది విషయాలు మీకు    తెలుసా?
Acharya : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Acharya : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతోంది. భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో రామ్ చరణ్ కీలక పాత్రలో నటిస్తుండడంతో ఈ మూవీ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.. !

అక్టోబరు 8, 2019 విజయదశమి రోజు 'చిరు 152' వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా మొదలైంది. రిలీజ్ అయ్యేసరికి ఈ సినిమాకి రెండు సంవత్సరాల ఆరు నెలల సమయం పట్టింది.

♦ ఈ సినిమాలో చిరు, చరణ్ కలిసి నటిస్తున్నారు. చిరు-నాగబాబుల తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి ఇద్దరు నటులు కలిసి చేస్తున్న సినిమా ఇదే కావటం విశేషం.

♦ చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్‌ 150' సాంగ్‌లో చరణ్‌ అలా మెరవగా, రామ్ చరణ్‌ నటించిన 'మగధీర', 'బ్రూస్లీ' చిత్రాల్లో చిరు మెరిశారు.

♦ ఆచార్య మూవీ టైటిల్ ని స్వయంగానే చిరంజీవినే లీక్ చేశారు.

♦ స్టాలిన్ చిత్రం తర్వత మణిశర్మతో సినిమాని చేస్తున్నారు చిరంజీవి.

♦ ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషని అనుకున్నారు.. ఆ తర్వాత ఆమె తప్పుకోవడంతో కాజల్ ని తీసుకున్నారు.

♦ ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ధర్మస్థలి ప్రాంతంలో జరుగుతుంది. అందుకే కోకాపేటలోని చిరంజీవికి చెందిన 20 ఎకరాల స్థలంలో నాలుగు నెలల పాటు శ్రమించి 'ధర్మస్థలి' సెట్‌ వేశారు.

♦ ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. గతంలో చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేష్.. అయితే ఈ రెండు సినిమాల్లో మెగా బ్రదర్స్ నక్సలైట్‌ పాత్రల్లోనే కనిపించారు.

♦ ఈ సినిమా రన్ టైం 154 నిమిషాలు. రూ.140 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.

♦ ముందు ఈ సినిమాను మే 13, 2021 రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత సంక్రాంతి అనుకోగా మళ్ళీ కరోనా వల్ల వాయిదా పడింది.. మళ్లీ ఫిబ్రవరి 4, లేదా ఏప్రిల్‌ 1 2022న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు,, చివరకు ఏప్రిల్‌ 29న రిలీజ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story