లోకేష్కి థ్యాంక్స్.. నన్ను చంపలేదు: త్రిష
నటి త్రిష నలభయ్యవ ఏటలోకి అడుగుపెట్టిందంటే ఎవరైనా నమ్మగలరా.. తన వయసు అసలు పెరగనివ్వకుండా ఏదైనా అమృతం తాగిందా అన్నట్లు ఉంటుంది. అందుకే తన తరం హీరోయిన్లకంటే ఎక్కువ ఆఫర్లను త్రిష సొంతం చేసుకుంటోంది. తాజాగా తమిళంలో విజయ్ తో నటించిన లియో సక్సెస్ మీటీలో త్రిష సందడి చేసింది.
ఈ సినిమాలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన పాత్రను చంపనందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పింది. సాధారణంగా లోకేష్ సినిమాలో హీరోయిన్ ని చంపేస్తుంటాడని, కానీ తన క్యారెక్టర్ కు ఏమీ జరగనందుకు అతడికి త్రిష కృతజ్ఞతలు తెలిపింది. ఆ విషయం కథ చెప్పేటప్పుడే తనకు హామీ ఇచ్చాడని తెలిపింది.
తనను చంపనందుకు లోకేష్కి థ్యాంక్స్ చెప్పింది త్రిష. నిన్న రాత్రి చెన్నైలో జరిగిన LEO సినిమా సక్సెస్ ఈవెంట్లో తలపతి విజయ్ మరియు త్రిష పాల్గొన్నారు. విజయ్ తన అద్భుతమైన ప్రసంగంతో అభిమానులను ఉచ్చాహపరిచాడు. త్రిష కూడా తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
దాదాపు 15 సంవత్సరాల తర్వాత త్రిష విజయ్తో జోడీ కట్టింది. వీళ్లిద్దరూ చివరిసారిగా కలిసి నటించిన చిత్రం 2008 లో వచ్చిన కురువి. చాలా ఏళ్ల తర్వాత విజయ్తో కలిసి నటించడం గురించి త్రిష మాట్లాడుతూ హైస్కూల్ స్నేహితుడిని కలిసినట్లు అనిపించిందని తెలిపింది.
సినిమాటిక్ యూనివర్స్లో తనను భాగం చేసినందుకు లోకేష్ కనగరాజ్కి త్రిష కృతజ్ఞతలు తెలిపింది. 20 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న త్రిష స్టార్డమ్ను ఆస్వాదించిందని విజయ్ ఆమెను ప్రశంసించాడు.
#Leo team HD pics from today's #LeoSuccessMeet 📸 This is La Familia❤️😅 #ThalapathyVijay pic.twitter.com/M3k2G9xNU7
— Devanayagam (@Devanayagam) November 1, 2023
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com