Brinda : ఓటీటీలో త్రిష బృంద

త్రిష పోలీసు అధికారిణిగా నటించిన వెబ్ సిరీస్ బృంద. టాలీవుడ్ డైరెక్టర్ వంగల సూర్య మనోజ్ ఈ సిరీస్ ని తెరకెక్కించారు. దీనిని ఎప్పుడో 2021 లో అనౌన్స్ చేసినప్పటికీ దాదాపు మూడేళ్లు నిరీక్షణ తర్వాత ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ని మేకర్స్ మొత్తం 8 ఎపిసోడ్స్ గా ప్లాన్ చేసి రేపు ఆగస్ట్ 2 కి షెడ్యూల్ చేశారు. కానీ ఆగష్టు 1 అర్ధ రాత్రికి ముందే అందుబాటులోకి వచ్చేసి ట్విస్ట్ ఇచ్చింది. కాగా ఈ సిరీస్ పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ కి వచ్చింది. అన్నట్టు ఈ సిరీస్ ని ఎందులో చూడొచ్చు అంటే ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ సోనీ లివ్ వారు అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఈ థ్రిల్లర్ సిరీస్ ని చూడాలనుకునేవారికి ఇది శుభవార్తే కదా. ఈ సిరీస్ "బృంద" లో ఆమని, జయప్రకాష్, రాకేందు మౌళి, రవీంద్ర విజయ్ తదితరులు నటించారు. కాగా ఇప్పుడు త్రిష తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి సరసన భారీ చిత్రం "విశ్వంభర" లో నటిస్తోంది. అలాగే ఈ సినిమా మరిన్ని దక్షిణాది చిత్రాలు త్రిష చేతిలో ఉన్నాయి. సో ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ బిజీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com