Pooja Hegde: పూజా హెగ్డేపై ట్రోల్స్.. స్టార్ హీరోయిన్ అంటే ఐరన్ లెగ్గా అంటూ..

Pooja Hegde: పూజా హెగ్డేపై ట్రోల్స్.. స్టార్ హీరోయిన్ అంటే ఐరన్ లెగ్గా అంటూ..
Pooja Hegde: ఒక్క చిత్రం హిట్టైతే వరుస సినిమాల్లో ఆఫర్లు.. అదే ఒకటి , రెండు ప్లాపయితే ఐరన్ లెగ్ అని అపవాదు..

Pooja Hegde: ఒక్క చిత్రం హిట్టైతే వరుస సినిమాల్లో ఆఫర్లు.. అదే ఒకటి , రెండు ప్లాపయితే ఐరన్ లెగ్ అని అపవాదు.. ఈ మద్య ఏ సినిమాలో చూసినా పూజా హెగ్డే.. ఎవరి పక్కన చూసినా ఆమెనే హీరోయిన్.. అమాంతంగా పెరిగిందనుకున్న కెరీర్ గ్రాఫ్ అంతలోనే ఢమాల్ అంది..

'మాస్క్' అనే తమిళ చిత్రంతో పూజా హెగ్డే హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగులో 'ఒక లైలా కోసం', 'ముకుంద' హిందీలో 'మొహెంజో దారో' వంటి చిత్రాలలో మంచి పాత్రలే పోషించినా అవి తన కెరీర్ లో ప్లాపులుగానే మిగిలిపోయాయి.

దీంతో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయి. కానీ గత కొంతకాలంగా సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఎదిగి తన టాలెంట్ ఏంటో తెలియజెప్పింది. 'డీజే', 'అరవింద సమేత', 'మహర్షి', 'అల వైకుంఠపురములో' సినిమాలు వరుసగా హిట్లు అందుకోవడంతో తన కెరీర్ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయిందనుకున్నారంతా..

దీంతో నిర్మాతలు కూడా ఆమె అడిగిన మొత్తం ఇచ్చి హీరోయిన్ గా ఎంపిక చేస్తున్నారు. అయితే ఈ ఏడాది ఇప్పటికే రిలీజైన చిత్రాలు ఆమెను నిరాశపరిచాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన మూడు చిత్రాలు ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు తీసుకువచ్చాయి.

ప్రభాస్ తో నటించిన ' రాధేశ్యాం ' నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. విజయ్ హీరోగా తమిళంలో వచ్చిన 'బీస్ట్' కూడా బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాలో పూజా పాత్రకు అసలు స్కోప్ లేదంటూ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు 'ఆచార్య'లో రామ్ చరణ్ సరసన నీలాంబరిగా నటించింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

వరుసగా రెండు డిజాస్టర్ల నేపథ్యంలో 'ఆచార్య' విడుదలవడంతో పూజా ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. కానీ వర్కవుట్ కాలేదు. రెండు నెలల్లో మూడు ఫ్లాపులు అందుకున్న పూజాని ఇప్పుడు ఐరన్ లెగ్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతోంది. ఈ చిత్రమైనా తనకు మళ్లీ హిట్ ఇస్తుందేమో అని ఎదురుచూస్తోంది పూజా హెగ్డే.

Tags

Read MoreRead Less
Next Story