Tollywood: 'రుద్రంకోట'కు U/A సర్టిఫికెట్.. ఆగస్టులో రిలీజ్
సెన్సార్ పూర్తి చేసుకుని ఆగస్ట్ లో విడుదలకు సిద్ధమవుతోన్న `రుద్రంకోట`అనిల్ ఆర్కా కండవల్లి హీరోగా నటిస్తూనే, నిర్మిస్తోన్న రుద్రంకోట గురించి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా రీసెంట్ సెన్సార్ పూర్తి చేసుకోగా.. ఇప్పుడు U/A సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. విభీష, రియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు నెలలో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. సీనియర్ నటి జయలలిత సమర్పకులుగా వ్యవహిరస్తూ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ కె విజువల్స్ పతాకంపై నిర్మిస్తుండగా.. రాము కోన దర్శకత్వం వహిస్తున్నారు.'రుద్రంకోట' ఇటీవలే ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం ఆగస్టు నెలలో స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి..`` శ్మశాన వాటికలో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మాక్స్ వారు గ్రాండ్ గా విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఆగస్ట్ లో సినిమాను విడుదల చేయనున్నాం`` అని అన్నారు.
ఇక గతేడాది ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయలలిత గురించి ప్రస్తావించిన మోహన్ బాబు.. ఆమెతో తనకు రౌడీ గారి పెళ్లాం నుంచి పరిచయమని చెప్పారు. అప్పట్నుంచి ఆమె అంటే తనకు గౌరవం, ప్రేమ, అభిమానం అని తెలిపారు. జయలలిత చాలా మంచి మనిషన్న ఆయన.. ఆమె తొలిసారిగా ఓ చిత్రాన్ని సమర్పిస్తోందని తెలిసి తన వంతు సహకారం అందించాలని వచ్చానని మోహన్ బాబు స్పష్టంచేశారు. ఎవరైనా చిన్న సినిమాలతోనే మొదలుపెట్టి ఉన్నత స్థానానికి వెళతారని, నిర్మాతగా తన ప్రయాణం కూడా చిన్న సినిమాతోనే మొదలైందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
ఈ సినిమాలో అందరూ కొత్తవారే చేస్తుండడం గొప్ప విషయమని, వారందరూ ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నట్టు మోహన్ బాబు చెప్పారు. వారి సినిమాల్లో తనకూ అవకాశమివ్వాలని వ్యాఖ్యానించారు. ఇక ఈ సినిమాపై సినీ నటి జయలలిత మాట్లాడుతూ.. ఈ సినిమాలో అనిల్ రుద్రంగా, తాను కోటమ్మగా నటించామని చెప్పారు. వాళ్లకీ, ఊరుకీ ఉన్న సంబంధం ఏంటీ.. అసలు రుద్రంకోటలో ఏం జరిగిందనేది తెరపైనే చూడాలని చెప్పారు. ఇందులో నటించిన వారందరికీ ప్రాముఖ్యత ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
ఈ 'రుద్రంకోట' సినిమాలో సీనియర్ నటి జయలలిత, ఆలేఖ్య, బాచి, రమ్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డీఓపీ ఆదిమల్ల సంజీవ్ కాగా సుభాష్ ఆనంద్ సంగీతం అందిస్తున్నారు. నిరంజన్ ఈ సినిమాకు ఎడిటర్ గా ఉండగా.. కీర్తి శేషులు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com