Vijay Devarakonda : మా హీరో తప్పు చేయలేదు

తెలంగాణ స్టేట్ లో బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వం కొరడా ఝలిపిస్తోంది. ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నవారినపైనా కేస్ లు నమోదు చేస్తోంది. ఈ క్రమంలో కొందరు టాప్ సెలబ్రిటీస్ పేర్లు కూడా ఇందులో వినిపిస్తున్నాయి. వారిపై కేస్ లు పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పేర్లలో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. అయితే మా హీరో తప్పు చేయలేదు అంటూ ఆయన టీమ్ నుంచి ఓ క్లారిటీ లెటర్ వచ్చింది. దాని ప్రకారం చూస్తే విజయ్ దేవరకొండ చట్ట ప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేశాడు అని చెబుతున్నారు. ఆ కంపెనీలు చట్టప్రకారమే నిర్వహిస్తున్నాయని తెలిపారు.
‘‘ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు. విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది అని వెల్లడైన తర్వాతే విజయ్ ఆ యాడ్ కు ప్రచారకర్తగా ఉంటారు. విజయ్ దేవరకొండ అలాంటి అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు..’’ అని వివరణ ఇచ్చారు. మరి దీనిపై సోషల్ మీడియాతో పాటు పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com