ZEE 5 : సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’

ఓటిటి ప్లాట్ ఫామ్ ‘జీ5’లో వచ్చే థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. గతంలో రెక్కీ వంటి ఉత్కంఠ భరితమైన థ్రిల్లర్ ను అందించిన వీరు ఈ సారి ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’అనే వెబ్ సిరీస్ తో రాబోతున్నారు. ఈ సిరీస్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందింది. కృష్ణ పోలూరు డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో అభిజ్ఞా వూతలూరు, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ జూన్ 27 నుంచి జీ5 లో స్ట్రీమ్ కాబోతోంది.
గ్రామీణ వాతావరణం, ప్రకృతి సౌందర్యాల నడుమ సూపర్ నేచురల్ థ్రిల్లర్గా సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’. ఒక గ్రామంలో ఉండే రహస్యాలు, దాన్ని ఛేదించేలా ఇంట్రెస్టింగ్గా సాగే ఇన్వెస్టిగేషన్ అన్నీ కలిపి సీటు అంచున కూర్చునేలా ఈ వెబ్ సిరీస్ను రూపొందించారు.
1980ల నాటి మారుమూల, భయానక గ్రామమైన విరాటపాలెం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ ఊరికి ఉన్న శాపం, ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణించడం, దీంతో దశాబ్ద కాలంగా ఏ వివాహం జరగకపోవడం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. అలా చివరకు పెళ్లిళ్లు అనేవి జరగకుండా గ్రామం భయంతో స్తంభించిపోతుంది. ఒక పోలీసు కానిస్టేబుల్ (అభిజ్ఞ వూతలూరు) ఆ గ్రామానికి రావడం, అక్కడి శాపం గురించి తెలుసుకోవడం, ఆ రహస్యాన్ని ఛేదించడం అనే ఉత్కంఠభరితమైన కథనంతో అందరినీ ఆకట్టుకునేలా ఈ సిరీస్ ఉండబోతోంది.
తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచింగ్ జరిగింది. ఈ సందర్భంగా ..
జీ5 తెలుగు బిజినెస్ హెడ్ అనురాధ గూడూర్ మాట్లాడుతూ .. ‘జీ5 లో సాధారణ ప్రజలను ప్రతిబింబించే, వారికి కనెక్ట్ అయ్యే కథల్ని అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ‘విరాటపాలెం : PC మీనా రిపోర్టింగ్’ అనేది ఉత్కంఠను కలిగిస్తూనే సామాజిక సందేశాన్ని కూడా అందిస్తుంది. భయం అనేది సమాజాన్ని ఎలా నియంత్రించగలదో, ధైర్యం అనేది దశాబ్దాల నిశ్శబ్దాన్ని ఎలా భంగపరచగలదో ఈ సిరీస్ చూపిస్తుంది’ అని అన్నారు.
దర్శకుడు కృష్ణ పోలూరు మాట్లాడుతూ .. ‘‘రెక్కీ’ తర్వాత, మరోసారి ZEE5తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ సిరీస్లో ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రతి వధువు తన పెళ్లి రోజున మరణిస్తుంది. ఆ నమ్మకం భయంగా, భయం నిశ్శబ్దంగా మారిపోతుంది. అలా దశాబ్ద కాలంగా వివాహాలను ఆపివేసిన గ్రామంలోని ఆ నిశ్శబ్దాన్ని ఛేదించడమే ఈ సిరీస్ కథ. అక్కడ ఒక స్త్రీ అందరూ భయపడే ప్రశ్న అడగడానికి ధైర్యం చేస్తుంది’ అని అన్నారు.
సౌత్ ఇండియన్ స్క్రీన్స్ నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ .. ‘‘రెక్కీ’ విజయం తర్వాత, ‘విరాటపాలెం: పిసి మీనా రిపోర్టింగ్’ కోసం మరోసారి ZEE5తో చేతులు కలపడం చాలా బాగుంది. ఈ కథ నాకు మొదటి నుంచీ ప్రత్యేకంగా నిలిచింది. ఈ కథ విన్నప్పటి నుంచీ నన్ను వెంటాడుతూనే ఉంది. టెలివిజన్ కోసం కథలను సృష్టించడం, పాత్రలను పోషించడం కోసం సంవత్సరాలు గడిపిన వ్యక్తిగా ఈ ప్రాజెక్ట్ నాకు మరింత ఆవిష్కరించుకునేందుకు ఉపయోగపడింది. ఈ సిరీస్తో మేం నిర్మించిన ప్రపంచం గురించి ఎంతో గర్విస్తున్నాను. ప్రేక్షకులు మేం క్రియేట్ చేసిన ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూస్తారా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
అభిజ్ఞ వూతలూరు మాట్లాడుతూ .. ‘ఈ ప్రాజెక్ట్లో భాగం కావడం చాలా ఆనందంగా, సంతృప్తికరంగా ఉంది. ఈ పాత్రలో చాలా సున్నితత్వం, బలం ఉంటుంది. ముఖ్యంగా భయానికి అనుకూలంగా వాస్తవాలను తోసిపుచ్చే ప్రపంచంలో తిరిగి ప్రశ్నించే ఓ శక్తివంతమైన పాత్రలో కనిపిస్తాను. రియల్ లొకేషన్స్, గ్రామీణ వ్యక్తులతో కలిసి షూటింగ్ చేయడం మర్చిపోలేని అనుభూతి. ప్రేక్షకులు దీన్ని ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com