Vivek Agnihotri: కనీసం చనిపోయిన వారికి గౌరవం ఇవ్వండి: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్..

Vivek Agnihotri: కనీసం చనిపోయిన వారికి గౌరవం ఇవ్వండి: కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్..
Vivek Agnihotri: ది కశ్మీర్ ఫైల్స్ చూసి.. దాని చుట్టూ రాజకీయంగా ఉచ్చు బిగించాలి అనుకుంటున్నారు కొందరు..

Vivek Agnihotri: కాశ్మీరీ పండితుల యదార్థగాధను తెరకెక్కించిన చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్'.. ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి విడుదలైన తొలిరోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. చిత్రంలో చూపించిన కశ్మీరీ హిందువులపై జరిగిన అఘాయిత్యాల యదార్థ గాథ ప్రజల హృదయాలను కలవరపరిచింది. తాజాగా ఈ సినిమా గురించి ఓ రూమర్ వైరల్ అవుతుండగా దానికి డైరెక్టర్ కాస్త ఘాటుగా స్పందించారు.

సినిమా చూసి కొంత మంది ఎమోషనల్ అయితే, చాలా మంది షాక్ అయ్యారు. అద్భుతంగా తెరకెక్కించారని అందరూ మెచ్చుకుంటున్నారు. దేశ ప్రధానితో సహా పలువురు పెద్దల వరకు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ సెలబ్రిటీలు సైతం ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేమని చెప్తున్నారు. అంతే కాకుండా ది కశ్మీర్ ఫైల్స్ విడుదలయిన వారం రోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టింది.

ది కశ్మీర్ ఫైల్స్ చూసి.. దాని చుట్టూ రాజకీయంగా ఉచ్చు బిగించాలి అనుకుంటున్న కొందరు.. అసలు ఈ సినిమాకు సెన్సార్ ఆమోదం తెలుపలేదు అంటూ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీంతో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విటర్ వేదికగా వారందరికీ స్పష్టత ఇచ్చాడు. అంతే కాకుండా 'ఎప్పటిలాగానే ఫేక్ న్యూస్ వ్యాపించేలా చేయకండి ప్లీజ్. కొంచెం బ్రేక్ తీసుకోండి. కనీసం చనిపోయిన వారికి గౌరవం ఇవ్వండి' అంటూ ట్వీట్ చేశాడు వివేక్.

Tags

Read MoreRead Less
Next Story