Ranbir Kapoor: షూటింగ్స్ తో బిజీ.. పెళ్లయినట్లే లేదు.. : రణబీర్ కపూర్

Ranbir Kapoor: షూటింగ్స్ తో బిజీ.. పెళ్లయినట్లే లేదు.. : రణబీర్ కపూర్
Ranbir Kapoor: తమకు వివాహం అయిందన్న విషయాన్నే మర్చిపోయాం అంటున్నాడు రణభీర్ కపూర్. వివాహం అయిన రెండో రోజు నుంచి ఒప్పుకున్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పనిలో మునిగిపోయారు భార్యభర్తలు ఇద్దరూ.

Ranbir Kapoor: తమకు వివాహం అయిందన్న విషయాన్నే మర్చిపోయాం అంటున్నాడు రణభీర్ కపూర్. వివాహం అయిన రెండో రోజు నుంచి ఒప్పుకున్న ప్రాజెక్టులు కంప్లీట్ చేసే పనిలో మునిగిపోయారు భార్యభర్తలు ఇద్దరూ.

రణబీర్ కపూర్, అలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. బాంద్రాలోని రణబీర్ ఇంట్లో అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. పెళ్లైన వెంటనే, కొత్త జంట తమ కమిట్‌మెంట్‌ల కారణంగా తిరిగి తమ పనిలో జాయిన్ అయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రణబీర్ తమ వివాహానంతర విషయాలను పంచుకున్నారు.

తన వైవాహిక జీవితం గురించి రణబీర్ మాట్లాడుతూ.. పెళ్లయినప్పటి నుంచి తాము చాలా బిజీగా ఉన్నామని చెప్పాడు. ఐదేళ్లు కలిసి ఉన్నందున పెళ్లి తర్వాత తమ జీవితాల్లో పెద్దగా మార్పు రాలేదని కూడా చెప్పాడు.

వివాహం జరిగిన మరుసటి రోజే ఆలియా తన హాలీవుడ్ అరంగేట్రం షూటింగ్ ప్రారంభించడానికి లండన్‌కు వెళ్లింది. రణభీర్ 'యానిమల్' షూటింగ్ కోసం మనాలికి వెళ్ళాడు. అలియా ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత, రణబీర్ తన ' శంషేరా ' సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంటాడు. పెళ్లయిందన్న విషయం తెలియకపోవడంతో వారం రోజులు సెలవు పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

తన భార్యలాగే హాలీవుడ్ చిత్రాలలో పనిచేయడం గురించి మాట్లాడుతూ, రణబీర్ తనకు హాలీవుడ్ లో పని చేయాలని ఏమీ లేదని చెప్పాడు. తనకు ' బ్రహ్మాస్త్రం ' వంటి చిత్రాలు మాత్రమే చేయాలని ఉంటుందని అన్నారు . మన సంస్కృతిలో ఉన్న ఒరిజినల్ కంటెంట్ ప్రతి ప్రేక్షకుడిని తాకుతుందని అన్నాడు. తాను ఇక్కడ సంతోషంగా ఉన్నానన్నారు.

'బ్రహ్మాస్త్ర'లో ఆలియా, రణబీర్‌లు స్క్రీన్‌ పంచుకున్నారు. జూన్ 15న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలవుతుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

Tags

Read MoreRead Less
Next Story