Tollywood: రమ్యకృష్ణ కొడుకు రిత్విక్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు

Tollywood: రమ్యకృష్ణ కొడుకు రిత్విక్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడు
Tollywood: కృష్ణవంశీ ఇప్పుడు తన దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Tollywood: కృష్ణవంశీ ఇప్పుడు తన దర్శకత్వంలో 'రంగమార్తాండ' సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా కృష్ణవంశీ మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కృష్ణ వంశీ మాట్లాడుతూ.. ‘‘నేను బాగా చదివి మంచి ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడాలని మా తల్లిదండ్రులు కోరుకున్నారు. నేను సినిమాలకు తప్ప దేనికీ కనెక్ట్ కాలేదు. అందుకే ఇంట్లో చెప్పకుండా పారిపోయాను.” నేను 'అంతఃపురం' సినిమా చేస్తున్న సమయంలో మా నాన్న చనిపోయారు. మా అమ్మ మాతోనే ఉంటుంది. ఆమె నాతో తప్ప మరెక్కడా ఉండదు, ఉండలేదు కూడా. ఇక తన కొడుకు గురించి కృష్ణవంశీ మాట్లాడుతూ.. ''ప్రస్తుతం మా అబ్బాయి రిత్విక్ వంశీ టీనేజ్‌లో ఉన్నాడు. అతని అభిరుచులు వారానికి ఒకసారి మారుతుంటాయి. ఒకసారి క్రికెట్ అంటాడు, ఇంకోసారి ఫుట్‌బాల్ అంటాడు... ఇంకోసారి ఇంకేదో అంటాడు. నా భార్య రమ్య వాడిని హ్యాండిల్ చేస్తుంది. వాడి చదువు విషయాలు చూసుకుంటుంది. చెల్లి కూడా రిత్విక్‌ని చూసుకుంటుంది.”

రంగమార్తాండలో రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ భరద్వాజ్ ఆదర్శ్, బాలకృష్ణ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఆకెళ్ల శివప్రసాద్ డైలాగ్స్ రాశారు. లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ బాణీలు అందించారు. హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా రంగమార్తాండను నిర్మిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story